నాయుడుపేట సమీపంలో వెన్నమాల వద్ద తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది.
నెల్లూరు జిల్లా: నాయుడుపేట సమీపంలో వెన్నమాల వద్ద తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. కేశినేని ట్రావెల్స్ కు చెందిన బస్సు (AP16TB7600)బోల్తా పడింది.ఇందులో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రయాణికులను వెంటనే దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.