
50 ఏళ్లకే ఇంటికి పంపించం: యనమల
ప్రభుత్వ నిర్వాకాలను సాక్ష్యాలతో సహా ప్రజలముందు ఉంచుతున్న ‘సాక్షి’ దినపత్రికపై ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.
శనివారం సాయంత్రం కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చి పదవీ విరమణ వయసును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచిన ఘనత చంద్రబాబుదేనన్నారు. జీవో ముసాయిదా కాపీలతో సహా ‘సాక్షి’ ప్రచురించినా అదంతా అవాస్తవమని యనమల చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.