లారీ డ్రైవర్లపై దోపిడి దొంగలు దాడి | Lorry drivers attacked by thieves at Machilipatnam- Hanuman junction highway | Sakshi
Sakshi News home page

లారీ డ్రైవర్లపై దోపిడి దొంగలు దాడి

Jun 10 2014 8:21 AM | Updated on Aug 28 2018 7:30 PM

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అరుగోలను సమీపంలో గత అర్థరాత్రి దోపిడి దొంగలు హల్చల్ సృష్టించారు.

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అరుగోలను సమీపంలో గత అర్థరాత్రి దోపిడి దొంగలు హల్చల్ సృష్టించారు. మచిలీపట్నం - హనుమాన్ జంక్షన్ రహదారిపై వెళ్తున్న లారీని ఆపి దొంగలు నగదు డిమాండ్ చేశారు. తమ వద్ద చాలా తక్కువ మొత్తంలో నగదు ఉందని లారీలోని ఇద్దరు డ్రైవర్లు దొంగలకు తెలిపారు. దాంతో ఆగ్రహాంచిన దొంగలు డ్రైవర్లతోపాటు లారీలోని క్లీనర్పై దాడి చేశారు. అనంతరం దోపిడి దొంగలు అక్కడి నుంచి పరారైయ్యారు.

 

అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ తరలించాలని వైద్యులు పోలీసులకు సూచించారు. దాంతో వారిని విజయవాడ తరలించారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారైన దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement