రంగురాళ్ల తవ్వకాలపై ఆరా | Sakshi
Sakshi News home page

రంగురాళ్ల తవ్వకాలపై ఆరా

Published Mon, Sep 9 2019 12:17 PM

Investigations on Colour Stone Hunting in Visakhapatnam - Sakshi

విశాఖపట్నం, గొలుగొండ(నర్సీపట్నం):సాలికమల్లవరం రంగురాళ్ల క్వారీలో  తవ్వకాలు జరిగినట్టు వచ్చిన సమాచారంతో ఎస్‌ఐ నారాయణరావు, వీఆర్‌వో పడాల్‌ క్వారీ ప్రాంతాన్ని ఆదివారం పరిశీ లించారు. గ్రామ సమీపంలో జిరాయితీ భూమి లో గతంలో రంగురాళ్లు బయటపడ్డాయి.ఆదివారం కొంతమంది  ఈ క్వారీలో మట్టిని తరలించి, సమీప తాండవ నది సమీపంలో నీటితో రంగురాళ్లు కడిగినట్టు వచ్చిన సమాచారంతో ఆ ప్రాంతాలను పరిశీలించారు. తాండవ నది పరిసరాలు అన్నింటిని పరిశీలించిన ఎస్‌ఐ, వీఆర్‌వోలు, సాలికమల్లవరంలో గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు.  అయితే ఇక్కడ తవ్వకాలు జరగలేదని అధికారులు గుర్తించారు. ఈ విషయంపై వీఆర్‌వో పడాల్‌ను సంప్రదించగా జిరాయితీ భూమిలో రంగురాళ్లు తవ్వినట్టు వచ్చిన సమాచారంతో  తాండవ నది పరిసర ప్రాంతాలను పరిశీలించినట్టు చెప్పారు. ఎక్కడా తవ్వకాలు జరగలేదని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement