రైతుల సమస్యలపై తనను కలిసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తనదైన శైలిలో చురక అంటించారు.
రైతుల సమస్యలపై తనను కలిసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తనదైన శైలిలో చురక అంటించారు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న కరెంటు అర్హులైన రైతులకు మాత్రమే అందితే బాగుంటుందని, కానీ మీవల్లే పెద్ద రైతులు కూడా దాన్ని అనుభవించే పరిస్థితి తలెత్తిందని ఆయన అన్నారు.
దాంతో ఏమీ మాట్లాడలేని నాయకులు నీళ్లు నమిలినట్లు తెలిసింది. ఇక ఇప్పుడు ఎటూ మంత్రివర్గం లేదు కాబట్టి, రైతులకు విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని వారు గవర్నర్ను కోరారు.