తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ లీక్ అవడంతో నలుగురికి గాయాలు అయ్యాయి.
గ్యాస్ లీక్: నలుగురికి గాయాలు
Jan 27 2016 1:02 PM | Updated on Sep 3 2017 4:25 PM
సఖినేటిపల్లి: తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ లీక్ అవడంతో నలుగురికి గాయాలు అయ్యాయి. సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలోని కలిదిండివారిమెరక ప్రాంతంలో కేజీ బేసీన్ 29, 31, 32 బావుల్లో నెల నుంచి రీడ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయి. బుధవారం ఇక్కడ ఓ పైపు జాయింట్ వీక్ కావడంతో భారీ శబ్ధంతో గ్యాస్ పైకి ఎగజిమ్మింది. పైన డ్రిల్లింగ్ పనులు చేస్తున్న నలుగురికి గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం మలికిపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement