సీఎం జగన్ను కలిసిన ఫ్రెంచ్ పరిశ్రమల ప్రతినిధులు
సాక్షి, అమరావతి : ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఫ్రెంచ్ పరిశ్రమల ప్రతినిధులు కలిశారు. గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రితో వారు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పట్టణ మౌలిక వసతులు, స్మార్ట్ సిటీ, పట్టణాభివృద్ధి, ఆటోమొబైల్, సౌర, ఇంధన పునరుత్పాదకత తదితర రంగాలలో పెట్టుబడికి వారు ఆసక్తి కనబర్చారు.