విశాఖపట్నం నగరంలోని ఐఎన్ఎస్ సాముద్రిక ఆడిటోరియం వద్ద మంగళవారం ఉదయం సిటీ బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.
విశాఖపట్నం నగరంలోని ఐఎన్ఎస్ సాముద్రిక ఆడిటోరియం వద్ద మంగళవారం ఉదయం సిటీ బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దాంతో ఆందోళన చెందిన ప్రయాణికులు బస్సులో నుంచి దూకి రహదారిపై పరుగులు తీశారు. అయితే ఆ సమీపంలోనే ఉన్న నేవీ సిబ్బంది వెంటనే స్పందించారు. బస్సులో చెలరేగిన మంటలను స్థానికులు సహయంతో నేవీ సిబ్బంది ఆర్పివేశారు. పోలీసులు సిటీ బస్సు వద్దకు చేరుకుని మంటలకు గల కారణాలపై బస్సు డ్రైవర్ ను ప్రశ్నిస్తున్నారు.