సిటీ బస్సులో చెలరేగిన మంటలు
విశాఖపట్నం నగరంలోని ఐఎన్ఎస్ సాముద్రిక ఆడిటోరియం వద్ద మంగళవారం ఉదయం సిటీ బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దాంతో ఆందోళన చెందిన ప్రయాణికులు బస్సులో నుంచి దూకి రహదారిపై పరుగులు తీశారు. అయితే ఆ సమీపంలోనే ఉన్న నేవీ సిబ్బంది వెంటనే స్పందించారు. బస్సులో చెలరేగిన మంటలను స్థానికులు సహయంతో నేవీ సిబ్బంది ఆర్పివేశారు. పోలీసులు సిటీ బస్సు వద్దకు చేరుకుని మంటలకు గల కారణాలపై బస్సు డ్రైవర్ ను ప్రశ్నిస్తున్నారు.