‘మీపై ఫిర్యాదులొస్తున్నాయి. స్వచ్ఛందంగా రాజీనామా చేయండి. మీకే మంచిది. లేదంటే విచారణ, ఆపై కేసులు బనాయించి డీలర్షిప్ రద్దు చేయాల్సి ఉంటుంది. అధికార పార్టీ నుంచి ఒత్తిడి ఉంది. అర్థం చేసుకొని రాజీనామా చేయండి. లేకుంటే సమస్యలు కొని తెచ్చుకున్న వారవుతారు.’
-రేషన్షాపు డీలర్లను హెచ్చరించిన ఒంటిమిట్ట తహశీల్దార్ ఈశ్వరయ్య
తహశీల్దార్లు రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి పైరవీలతో పోస్టింగ్లు తెచ్చుకుంటున్నారు. అందుకే అలా వ్యవహరిస్తున్నారు. పదేళ్ల క్రితం ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి విషయంలోనూ రాజకీయ నేతల జోక్యం తప్పడంలేదు. అధికార పార్టీకి తలొగ్గాల్సి వస్తోంది.
- ఓ ఉన్నతస్థాయి అధికారి అభిప్రాయం
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో పాలనకు అధికారుల వైఖరి అద్దం పడుతోంది. అధికార పార్టీ కనుసన్నల్లో జిల్లా యంత్రాంగం మసలుకుంటోందని రూఢీ అవుతోంది. తహశీల్దార్లను గాడిలో పెట్టాల్సిన ఉన్నతాధికారులు వారిని సమర్థిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలుకుతున్నారు. పచ్చ చొక్కా నేతల మెప్పు కోసం తహతహలాడుతున్నారు. నాయకుల మాటే వేదంగా తలాడిస్తూ ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా వ్యవహరిస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల ఆదేశాలను జీ..హుజూర్ అంటూ నిస్సిగ్గుగా పాటిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఇలాంటి పరిస్థితే ఉంది.
రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లాలో తెలుగు తమ్ముళ్ల పెత్తనం పెరిగింది. వీరికి అధికార యంత్రాంగం కూడా వంత పాడుతోంది. దీంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా పరిస్థితి తయారైంది. జిల్లాలో 1750 రేషన్షాపు డీలర్షిప్లుంటే సుమారు 250 చోట్ల ఖాళీలున్నాయి.
ఆయా స్థానాల్లో ఇన్ఛార్జులు కొనసాగుతున్నారు. అర్హతల ఆధారంగాా ఆ స్థానాల్లో అధికార పార్టీకి చెందిన వారిని నియమించినా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఉన్న డీలర్లను అకారణంగా తొలగించాలనుకోవడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో జమ్మలమడుగు డివిజన్లో తొలుత ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కావడంతో వైఎస్సార్సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు గత నెల 30న జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నడుచుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. దీంతో తాత్కాలికంగా అప్పట్లో డీలర్ల తొలగింపు కార్యక్రమానికి తెర పడింది.
అయితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ యంత్రాంగం అధికార పార్టీ మెప్పుకోసమే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందులో భాగంగా తహశీల్దార్లు ప్రత్యక్షంగా డీలర్లను వేధిస్తూ, హెచ్చరికలు జారీ చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు. హుందాగా వ్యవహరించాల్సిన అధికారులు పచ్చ రంగు పులుముకుంటున్నారు. పర్యవసానంగా జిల్లాలో పరిపాలన అధికార పార్టీ నేతల కనుసన్నల్లో కొనసాగుతోంది. అధికారులు ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ విధులు నిర్వర్తించాలని పలువురు కోరుతున్నారు.
పచ్చ పాలన!
Published Mon, Jul 28 2014 2:34 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అతనితో డేటింగ్.. తొలిసారి నోరువిప్పిన ముద్దుగుమ్మ!
త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు
AP: ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
స్వాతి మలివాల్పై దాడి.. ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement