హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో ఏనుగులు పంటపొలాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. కుప్పం మండలంలోని మోట్లచేను, కూసూయ, డోళ్లగుట్టు గ్రామాల పరిధిలో పొలాలపై దాడి చేశాయి. అరటి, బీన్స్, టమోటా తదితర పంటలను నాశనం చేశాయి.
Breadcrumb
Related news
-
Telangana Rains Photos: తెలంగాణలో అకాల వర్షం కారణంగా ఆవేదనలో అన్నదాత (ఫొటోలు)
-
చిత్తూరులో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి నామినేషన్
చిత్తూరులో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి నామినేషన్ -
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
కడెం(ఖానాపూర్): రబీ సీజన్లో సాగు చేసిన పంటలకు నీరందించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ కాలువకు నీటిని విడుదల చేయాలని కడెం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు నచ్చన్ఎల్లాపూర్ వద్ద నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై గురువారం బైఠాయించారు. వారం రోజులుగా సదర్మాట్ కాలువకు నీటిని విడుదల చేయకపోవడంతో కడెం మండలంలోని లింగాపూర్, మాసాయిపేట్, నచ్చన్ఎల్లాపూర్, పెద్దూర్తండా, చిట్యాల్, ధర్మాజీపేట్, తదితర గ్రామాల్లోని సుమారు 13 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. రైతులు ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే వెడ్మ సదర్మాట్ రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, కాలువ నీళ్లు వస్తాయ ని రైతులు ఆందోళన చెందవద్దని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హామీ ఇచ్చారు. సదర్మాట్ చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేయాలని ఈఎన్సీ నుంచి ఎస్ఈకి గురువారమే ఆదేశాలు వచ్చాయని ఆయన వెల్లడించారు. -
భగీరథ ప్రయత్నం!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆరుగాలం శ్రమించి వేసుకున్న పంటలను కాపాడుకొనేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. కళ్ల ముందే ఎండిపోతున్న పంటలను బతికించుకొనేందుకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. కరువు కారణంగా భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వట్టిపోవడంతో పంటలను ఎలాగైనా కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టులో ఇప్పటికే వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోగా సాగర్ బ్యాక్ వాటర్ కింద సాగు చేసుకుంటున్న రైతులు పంటలను కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బత్తాయి, మామిడి వంటి పండ్ల తోటలతోపాటు వేరుశనగ, వరి పంటలను బతికించుకొనేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. ముఖ్యంగా సాగర్ జలాశయం డెడ్ స్టోరేజికి చేరడంతో బ్యాక్ వాటర్ కిలోమీటర్ల మేర తగ్గిపోయింది. దీంతో నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలంలోని నంభాపురం, పెద్దగట్టు, పుట్టంగండి తదితర ప్రాంతాల్లో గిరిజన రైతులు పంటకు నీరందించేందుకు కిలోమీటర్ల పొడవునా పైపులైన్లు వేసుకొని మోటార్లు పెట్టి నీటిని తరలిస్తున్నారు. పెద్దవూర మండలం పాత్తితండా, పర్వేదుల తదితర గ్రామాల రైతులు పదుల సంఖ్యలో సాగర్ వెనుక జలాశయంలోని లోతట్టు ప్రాంతాల్లో కొద్దిపాటి నీళ్లు ఉన్న ప్రదేశాలకు దూరంగా బావులు తవ్వి అక్కడి నుంచి 7–8 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసుకుంటున్నారు. పంటల కోసం తంటాలు పడుతున్నాం పంటలు ఎండిపోకుండా నానా తంటాలు పడుతున్నాం. అప్పులు చేసి మరీ పంటలను కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నాం. నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజికి చేరడంతో బ్యాక్ వాటర్ నుంచి పంటలకు నీటిని అందించేందుకు కిలోమీటర్ల పొడవునా పైప్లైన్లు వేస్తున్నాం. – రమావత్ పత్తి, నంభాపురం -
ఆశలు..అడుగంటి.. గణనీయంగా పడిపోయిన భూగర్భ జలమట్టాలు
సాక్షి ప్రతినిధులు మహబూబ్నగర్/ కరీంనగర్/ ఖమ్మం: రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటం, భూగర్భ జలాలు అడుగంటడంతో పలు జిల్లాల్లో పంటలు ఎండి పోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. నీటి కొరత మామిడి లాంటి పంటల దిగుబడిపై ప్రభావం చూపిస్తోందని రైతులు చెబుతున్నారు. అప్పులు చేసి వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులు పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్లో బోర్లు వట్టి పోవడంతో నీరందక ఇప్పటివరకు లక్షకు పైగా ఎకరాల్లో పంటలు ఎండినట్లు అంచనా. ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మండే ఎండలు,అడుగంటిన భూగర్భ జలాలతో పంటలు ఎండిపోతున్నాయి. నిజానికి 2022–23 యాసంగిలో మొత్తం 5,15,375 ఎకరాల్లో పంటలు సాగైతే ఈ ఏడాది 3,55,827 ఎకరాల్లోనే సాగు చేశారు. పాలేరు రిజర్వాయర్ పరిధిలోని పాత కాల్వ కింద కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో సుమారు5 వేలకు పైగా ఎకరాల్లో వరి ఎండింది. భగీరథ ప్రయత్నం చేసినా.. ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన శీలం విష్ణు ఈ ఏడాది యాసంగిలో వైరా నది కింద11 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాడు. మరో 20 రోజుల్లో వరి చేతికి అందనుండగా వైరా రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గిపోయింది. దీంతో వైరా నదిలో పొక్లెయినర్తో గుంతలు తవ్విం చి మోటారు ద్వారా పైరుకు నీరందించే ప్రయత్నం చేశాడు. అయినా ఫలితం లేక 80 శాతం మేర పంట ఎండిపోయింది. పెట్టిన పెట్టుబడి అంతా నేల పాలైందని విష్ణు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధానంగావరి పంటపై రైతాంగం ఆధారపడుతుంది.పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఈసారి మార్చి 31 వరకు వేసంగి పంటకు నీరందింది. కానీ గతేడాదితో పోలిస్తే ఆశించినంత మేరకు అందలేదు. ఫలితంగా వేలాది ఎకరాల్లో వరి ఎండిపోయింది. పలుచోట్ల పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. కరీంనగర్ జిల్లాలో దాదాపు 25వేల ఎకరాల వరకు వరి పంట సాగునీరు అందక ఎండిపోయిందని అనధికారిక అంచనా. పెద్దపల్లి జిల్లాలో ఎండలు దంచికొడుతుండటంతో చెరువులు, బావులు వట్టిపోతున్నాయి. మంథని, ముత్తరాం, రామగిరి, కాల్వ శ్రీరాంపూర్, ఓదెలా మండలాల్లో సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. వీర్నాపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో మాత్రం కొంతమేర వరి పంట ఎండిపోయింది. ఇక జగిత్యాల జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్ అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కింద కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందక జిల్లావ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాల వరకు పొలాలు ఎండిపోయాయి. ఈనిన వరి ఎండిపోయింది.. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు లకావత్శ్రీనివాస్. ఊరు సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్మండలం సేవాలాల్ తండా. యాసంగిలోమూడెకరాల్లో వరి పంట వేశాడు. 3 బోరు బావులు నమ్ముకుని పంట సాగు చేస్తే భూగర్భజలాలు కాస్తా అడుగంటిపోయాయి. దీంతో బోర్లు వట్టిపోయి 3 ఎకరాల్లో ఈనిన పంటఎండిపోయింది. ఇటీవల రూ.లక్ష వెచ్చించి550 ఫీట్ల లోతులో బోరు వేయించాడు.కానీ నీళ్లు పడక పోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు. బకెట్తో నీళ్లు పోస్తూ.. ఈమె రైతు బోయ అంజమ్మ.నారాయణపేట జిల్లా మరికల్ మండలంఅప్పంపల్లికి చెందిన ఈమె పదేళ్లుగా కూరగాయల సాగు చేస్తోంది. ఈ ఏడాది అరఎకరంలో బెండతో పాటు ఇతర కూరగాయలు సాగు చేసింది. ఎండల తీవ్రత కారణంగా బోర్లల్లో నీటిమట్టం దాదాపుగా అడుగంటి పోయింది. వచ్చే కొద్దిపాటి నీటిని బిందెలు,బకెట్ల ద్వారా పోస్తూ పంటలు కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. 5 బోర్లువేశాడు మక్తల్ మండలం ఉప్పర్పల్లికి చెందిన రవీందర్రెడ్డికి 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.ఈ యాసంగిలో బోరుబావి కింద రెండు ఎకరాల్లో వరి, మిగతా మిరప తోట సాగు చేశాడు.భూగర్భజలాలు అడుగంటడంతో సుమారు రూ.1.20 లక్షలు వెచ్చించి ఐదు బోర్లు వేశాడు. రెండింటిలో నీరు పడలేదు. మూడింటిలో అంతంత మాత్రంగా నీరు పడింది. మిరపతోటకు నీరు సక్రమంగాఅందకపోవడంతో రూ.40 వేల వ్యయంతో స్ప్రింక్లర్లు వేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చేసిన అప్పు ఎలా తీర్చాలని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Related News by category
-
చంద్రబాబు, పవన్కు పొలిటికల్ ట్విస్ట్.. బీజేపీ కీలక ప్రకటన!
సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఎన్నికల వేళ కూటమిలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ, జనసేనకు బీజేపీ ఊహించని షాకిచ్చింది. ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ కట్టుబడి ఉంటుందని.. తెలుగుదేశం, జససేన నిర్ణయాలకు అనుకూలంగా ఉండలేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది.ఇక, ముస్లిం రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే డీప్ ఫేక్ వీడియోల వ్యవహారం సోషల్ మీడియా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ముస్లిం రిజర్వేషన్లపై ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా కేంద్ర పార్టీ నిర్ణయాన్ని ఏపీ బీజేపీ మరోసారి పునర్ఘటించింది. ఈ క్రమంలో ముస్లిం రిజర్వేషన్ల రద్దుకే కట్టుబడి ఉన్నామని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో.. టీడీపీ, జనసేన నిర్ణయాలకు తాము అనుకూలంగా లేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది. Truth: If BJP comes into power, we will make an end of the unconstitutional Muslim reservations. Meanwhile it's the right of SC, ST & OBC people of Telangana. We will ensure them that they get it. Therefore, We will end the Muslim Reservations.Fake Video: If BJP comes to power,… pic.twitter.com/4OxR8LP9Z9— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) April 30, 2024బాబును నమ్మని బీజేపీ ఈ ఎన్నికల్లో మళ్లీ బీజేపీతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడినప్పటికీ, ఆ పార్టీ జాతీయ నాయకత్వం తొలుత అంగీకరించలేదు. చంద్రబాబు ఢిల్లీలోని తన ఏజెంట్లు, బీజేపీలో ఉన్న తన అనుంగులు, ఇతరత్రా పైరవీలు చేశారు. అయినా బీజేపీ పెద్దలు ఆయన్ని నమ్మలేదు. ఢిల్లీలో రాత్రింబవళ్లు పడిగాపులు గాసి, కాళ్లా వేళ్లా పడి చిట్టచివరకు పొత్తు పెట్టుకోగలిగారు. బీజేపీ పొత్తయితే పెట్టుకొంది కానీ, చంద్రబాబును ఆ పార్టీ పెద్దలు నమ్మడంలేదన్న విషయం ప్రతి సందర్భంలోనూ బయటపడుతోంది. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన గెలుపే అసాధ్యమైతే, మేనిఫెస్టో విషయంలోనూ మరోసారి అభాసుపాలు కాకూడదని బీజేపీ అధిష్ఠానం భావించింది. దీంతో ఈసారి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఓ పరిశీలకుడిని మాత్రమే పంపి మమ అనిపించింది. కనీసం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి, పార్టీ రాష్ట్ర నాయకులు కూడా హాజరుకాలేదు.అంతేకాదు.. మేనిఫెస్టోలో కనీసం ప్రధాని మోదీ ఫొటోగానీ, కమలం గుర్తు గానీ ముద్రించేందుకు బీజేపీ పెద్దలు అంగీకరించలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్షా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫొటోలు ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. అయితే, చంద్రబాబు తెలివిగా మేనిఫెస్టో కాపీలపై మోదీ, ఇతర నాయకుల ఫొటోలు లేకుండా, కమలం గుర్తును మాత్రం వేయించారు. బీజేపీ దీనికీ అంగీకరించలేదు. దాన్ని మార్చాల్సిందేనని పరిశీలకుడు సిద్ధార్థనాథ్సింగ్ పట్టుబట్టారు. దీంతో మేనిఫెస్టో ముఖచిత్రంలో అప్పటికప్పుడు మార్పులు చేశారు. -
కృష్ణమ్మ తీరం విజయహారం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రగతి పరుగులు పెడుతోంది. విజయవాడను సుందరంగా తీర్చిదిద్దడంతో కృష్ణా నదీతీరం, దుర్గ గుడి, ప్రకాశం బ్యారేజీలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంబేడ్కర్ స్మృతివనం నగరానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. మరోవైపు మెగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, జగనన్న కాలనీలు, ప్రభుత్వ భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మూలపాడు వద్ద బటర్ఫ్లై పార్కును అందంగా తీర్చిదిద్ది 150 రకాల ఔషధ మొక్కలు పెంచుతున్నారు. కొండపల్లి బొమ్మల పరిశ్రమ అంతరించిపోకుండా వాటి తయారీదారులకు చేయూతనిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బందరులో అత్యధిక జనాభా ఆధారపడి పనిచేసే రోల్డ్గోల్డ్ పరిశ్రమకు ప్రోత్సాహం కలి్పస్తున్నారు. అక్కడి ప్రజల చిరకాల కోరిక పోర్టు నిర్మాణం కల నెరవేరనుంది. గిలకలదిండిలో మత్స్యకారులకు ఉపాధి కలి్పంచేందుకు హార్బర్ నిర్మాణం పూర్తి కావస్తోంది. మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయి 150 మంది విద్యార్థులతో తరగతులు జరుగుతున్నాయి. రుద్రవరంలో కృష్ణా యూనివర్సిటీ భవనాలు నిర్మాణం పూర్తి చేసుకొని కార్యకలాపాలు జరుగుతున్నాయి. విశాఖ బీచ్ తరహాలో ఆహ్లాదకరమైన వాతావరణం కలి్పంచేందుకు బందరు బీచ్లో రిసార్ట్స్, పార్కులు, గేమ్ జోన్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.రహదారులు.. అదరహో ⇒విజయవాడ బెంజిసర్కిల్ జంట ఫ్లై ఓవర్లు అందుబాటులోకి ⇒కృష్ణా నదిపై రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి కావడంతో తప్పిన ముంపు సమస్య ⇒వెస్ట్ బైపాస్ పనులు వేగంగా సాగుతున్నాయి తూర్పు బైపాస్ ప్రతిపాదనలకు తుది రూపు⇒జాతీయ రహదారి మొత్తం 17,761 మీటర్ల పొడవున 18 రహదారుల డివైడర్లను హరిత హారాలుగా తీర్చిదిద్దారు. ⇒నగరంలో 16 పార్కులను అభివృద్ధి చేశారు. ఎయిర్పోర్టు కారిడార్కు రూ.17 కోట్లతో తుదిరూపు ⇒మిషన్ క్లీన్ కృష్ణా కింద నదీ తీరాన్ని శుభ్రం చేశారు. నగరంలోని ప్రధాన కాలువల్లో బోటింగ్కు సన్నాహాలు ⇒కనకదుర్గా నగర్ గోశాల వద్ద రూ.216.05 కోట్లతో వివిధ పనులకు శంకుస్థాపన, రూ.23.145 కోట్లతో పూర్తి చేసిన పనులు ప్రారంభం ⇒ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో రూ.102 కోట్లతో డ్రెడ్జింగ్ పనులు రూ.62 కోట్లతో మున్నేరు కాల్వలఆధునికీకరణ పనులు ⇒ విజయవాడలో కాలువలపై రూ.31 కోట్లతో ఏడు బ్రిడ్జిల నిర్మాణం ⇒ జిల్లాలో తొలి విడతలో 1.07 లక్షల మందికి ఇళ్లు మంజూరు.. ⇒ వాటిలో 14,935 ఇళ్ల నిర్మాణం పూర్తి ⇒ కాల్వ గట్టు, ప్రభుత్వ స్థలాలు, రోడ్ల పక్కన నివాసం ఉండే వారిని తొలగించి వాంబే కాలనీలో ఇళ్లు కేటాయింపు ⇒ పటేల్నగర్, ప్రకాష్నగర్, వడ్డెరకాలనీ, నందావరి కండ్రిక ప్రాంతాల్లో గతంలో 13,915 ఇళ్లు నిర్మించి కొన్నింటినే రిజి్రస్టేషన్ చేశారు ⇒ జలజీవన్ మిషన్ కింద 77,123 గృహాలకు నీరు అందించేందుకు రూ.77.9 కోట్లు ఖర్చు చేశారు అంబేడ్కర్ స్మృతివనం అద్భుతం⇒ నగరాభివృద్ధికి చేసిన ఖర్చు – రూ.1,383 కోట్లు ⇒అంబేడ్కర్ స్మృతివనం కోసం చేసిన ఖర్చు– రూ.400 కోట్లు ⇒ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులు– రూ.239.19 కోట్లు ⇒ జీజీహెచ్లో నాడు–నేడు ద్వారా అభివృద్ధి పనులకు– రూ.170 కోట్లు ⇒ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణం కోసం – రూ.150 కోట్లు ⇒ కృష్ణా నది రక్షణ గోడ నిర్మాణం కోసం చేసిన ఖర్చు – రూ.394.27 కోట్లు ⇒బెంజి సర్కిల్ మొదటి ఫ్లైఓవర్ పొడవు– 2.27 కి.మీ ⇒ దాని నిర్మాణానికి చేసిన ఖర్చు– రూ.80 కోట్లు ⇒ బెంజి సర్కిల్ రెండవ ఫ్లైఓవర్ పొడవు – 1.703 కి.మీ ⇒ దాని నిర్మాణానికి చేసిన ఖర్చు – రూ.96 కోట్లు ⇒బెంజిసర్కిల్ వెస్ట్, ఈస్ట్ సైడ్ సరీ్వస్ రోడ్లకు ఖర్చు చేస్తున్న మొత్తం : రూ.40 కోట్లు ⇒ గన్నవరం విమానాశ్రయం హాఫ్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం చేసిన ఖర్చు –రూ.23.75 కోట్లు ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యసేవలు విజయవాడ జీజీహెచ్లో కార్డియోథోరాసిక్ సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, పిడియాట్రిక్ సర్జరీ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులోకి వచ్చాయి. రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిరి్మంచారు. అత్యాధునిక క్యాథ్ల్యాబ్, ఎంఆర్ఐ స్కాన్, 120 స్లైస్ సీటీ స్కాన్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం వైఎస్ జగన్ సీఎం కాగానే రూ.30 కోట్లు విడుదల చేశారు. రూ.170 కోట్లతో నాడు–నేడు పనులు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలకు రూ.437 కోట్లు ఖర్చు చేశారు. జిల్లాలోని ఏ కొండూరు మండలంలోని గిరిజన తండాల్లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రోగుల కోసం రూ.40 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. ఏ కొండూరు పీహెచ్సీలోనే డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి నెలా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అర్హులైన వారికి రూ.10 వేల పింఛన్ ఇస్తున్నారు. పురోగతిలో బెజవాడ బైపాస్ పనులు ప్యాకేజీ–3 చిన్న అవుటుపల్లి –గొల్లపూడి పొడవు: 30 కి.మీ ⇒ దీనికోసం ఖర్చు చేస్తున్న మొత్తం: రూ.1,148 కోట్లు ప్యాకేజీ–4 ⇒ గొల్లపూడి–చినకాకాని – 17.88 కి..మీ ⇒ కృష్ణా నదిపై ఆరువరుసల బ్రిడ్జి పొడవు– 3.12 కి.మీ ⇒ దీనికోసం ఖర్చు చేస్తున్న మొత్తం రూ.757 కోట్లు ⇒ ఈస్ట్ బైపాస్ ప్రతిపాదనలు ⇒ బైపాస్ పొడవు: 49.3 కి.మీ ⇒ కృష్ణా నదిపై నిర్మించే బ్రిడ్జి పొడవు – 3.750 కి.మీ ⇒ అంచనా వ్యయం మొత్తం –రూ.4,607.80 కోట్లు -
వైఎస్ జగన్... ఆ పేరే ఓ స్ఫూర్తి...
సాక్షి, అమరావతి: ‘పేదలు ఎదగాలంటే ప్రభుత్వ సాయం కావాలి. అందుకు సంక్షేమ పథకాలు చాలా వరకూ తోడ్పడతాయి. ఒక వైపు సంక్షేమం... మరోవైపు అభివృద్ధి ఏపీలో సమపాళ్లలో జరుగుతోంది. అందుకు కారకుడైన జగన్ అంటే అందుకే నాకు ప్రత్యేకమైన అభిమానం’ అంటున్నారు సినీ నటుడు రాజా రవీంద్ర. వ్యక్తిగతంగా తనకే కాదు చాలా మందికి ఆయన ఇన్స్పిరేషన్ అంటూ కొనియాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన పట్ల తన అభిప్రాయాల్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..పేదలు ఎదగాలంటే...ప్రభుత్వ ఆసరా కావాలి.. పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాలు ఎదగాలంటే మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతికి చేరాలంటే అది వారి కాయకష్టం మీద అయ్యేపని కాదు. కాబట్టి తప్పకుండా సంక్షేమ పథకాలు అవసరమవుతాయి. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పలు రూపాల్లో ఆసరా అందిస్తోంది.అన్నివర్గాల జీవన ప్రమాణాలు మెరుగవ్వాలంటే వారికి ప్రభుత్వం తప్పనిసరిగా అందివ్వాల్సింది విద్య, వైద్యం. ఈ విషయంలో చాలా మార్పులు జరిగాయి.దళారీలు లేకుండా చేరుతున్న లబ్ధి సంక్షేమ పథకాల అమలు విషయంలో గ్రామ వలంటీర్ల విధానం చాలా మంచి కాన్సెప్్ట. వీరి వల్ల మధ్యలో ఎవరికీ ఎటువంటి లంచాలు, పైరవీలతో తావు లేకుండా పేదలకు పథకాలు అందుతున్నాయి. ఈ వ్యవస్థ ఎంత గొప్పదో... ప్రయోజనాలు పొందుతున్నవారికి బాగా అర్థమవుతుంది. ఈ సంక్షేమ పథకాలన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా అమలు చేయడం గొప్ప విషయం. అధికారంలోకి రావడం కోసం పొత్తుల కన్నా ఒంటరిపోరుకే జగన్ సై అంటారు. ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆయన మీద అభిమానం చెక్కు చెదరలేదు. ఈ ఎన్నికల్లో జగన్ విజయం తథ్యం. ఖరీదైన వైద్యానికీ సర్కారు సాయం ప్రస్తుతం రోగాలు వస్తే దానికి వైద్యం ఎంత ఖరీదైపోయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏ రోగం వచ్చిన లక్షలకు లక్షలు మంచినీళ్లలా ఖర్చుచేయాల్సి వస్తోంది. ఒక కిడ్నీ పాడైనా చికిత్సకు రూ.20 లక్షలపైనే ఖర్చవుతోంది. ఈ పరిస్థితుల్లో అనుకోని వ్యాధి వస్తే ఎగువ మధ్యతరగతి కుటుంబాలు ఎలా తట్టుకోగలవు? ఇక నిరుపేదల సంగతైతే వేరే చెప్పనక్కర లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం వారిని ఎంతగానో ఆదుకుంటోంది. ఇప్పుడు వైద్య పరిమితిని రూ.25లక్షలకు పెంచారు. ఇది నిజంగా ఎక్స్ట్రార్డినరీ స్టెప్. విద్యతోనే విజయం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నాడు నేడు పేరిట ప్రభుత్వ పాఠశాలల్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. కొన్ని తరగతుల విద్యార్థులకు ట్యాబ్స్ అందిస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఇంగ్లిష్ మీడియం కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇది ఒక సమగ్ర విద్యావికాస మార్గంగా చెప్పాలి. వీటన్నింటివల్లా పాఠశాలల్లో చదివే వారిలో కనీసం 10శాతం మంది వృద్ధిలోకి వచ్చే అవకాశం కచి్చతంగా ఉంటుంది. అలా వచ్చిన వారు రూ.లక్షల్లో జీతాలు తెచ్చుకోగలుగుతారు. అప్పుడు తప్పకుండా పేదల జీవన ప్రమాణాల స్థాయి మారిపోతుంది. నిజంగా జరగాల్సింది అదే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతోంది. -
ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
వీరిని చూస్తే రంగులు మార్చే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. నేను అప్పుడప్పుడూ రంగులు మార్చితే వీళ్లు ఎన్నికలొచ్చినప్పుడల్లా కండువాలు మార్చేస్తున్నారే..? అంటూ ఒంటికాలిపై లేస్తోంది. పిలిచి టిక్కెట్లిచ్చి.. ఎన్నికల్లో గెలిపించుకున్న తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేస్తున్నారని మండిపడుతోంది. ప్రజాసేవను పక్కనబెట్టి స్వార్థ రాజకీయాల కోసం పరితపిస్తున్నారని విరుచుకుపడుతోంది.. అయితే.. వారి ప్రత్యర్థులను చూస్తే జాలేస్తోందని.. వారు సౌమ్యులు.. ప్రజాసేవకులని చెప్పుకొస్తోంది. అసలు జిల్లాలో అలాంటి వారు ఎవరు..? వారి కథా కమామిషు ఏంటో మీరే చదవండి..! సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జంపింగ్ జపాంగ్లంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఒకరు వెలగపల్లి వరప్రసాద్, ఆరణి శ్రీనివాసులు, ఆదిమూలం. ఈ ముగ్గురూ ఊసరవెల్లికి మించి రంగులు మారుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరు చొక్కాలు మార్చినంత ఈజీగా, పార్టీలు, కండువాలు మార్చే నాయకులని చర్చించుకుంటున్నారు. ప్రజాసేవకంటే సొంత ప్రయోజనాలే లక్ష్యంగా పారీ్టలు మారుతుంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో పారీ్టల కండువాలు మార్చడం అలవాటుగా మార్చుకున్నారని చర్చించుకుంటున్నారు. అయితే వీరి ఎంత స్వార్థపరులో ప్రస్తుతం బరిలో ఉన్న వీరి ప్రత్యర్థులు అంత సౌమ్యులని చెప్పుకుంటున్నారు. దోపిడీకి ఆయనే ‘మూలం’ సత్యవేడు టీడీపీ అభ్యర్థి ఆదిమూలం స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తారనే ప్రచారం ఉంది. ఆదిమూలం మొదట కాంగ్రెస్, ఆ తరువాత టీడీపీలో చేరారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆదిమూలాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్కున చేర్చుకుని సత్యవేడు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రెండు సార్లు ఎన్నికల బరిలో నిలిపారు. ఒకసారి ఓటమి పాలైనా.. రెండో పర్యాయం ఎమ్మెల్యేగా గెలిపించారు. కానీ ఆయన ప్రజలకు సేవ చేయడంలో విఫలమయ్యారు. ఇసుక, మట్టి అమ్ముకునేవారు. పరిశ్రమల నుంచి మామూళ్లు వసూళ్లు చేసేవారు. ఏదైనా సమస్యపై ఎమ్మెల్యే ఆదిమూలం వద్దకు వెళితే పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు బాధితులు చెబుతున్నారు. తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కుమారుడు సుమన్ చేయని అరాచకాలు లేవు. అధికారులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, విలేకరులపైన దౌర్జన్యాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆదిమూలానికి వైఎస్సార్సీపీ టికెట్ నిరాకరించింది. ఛీత్కారాలే ప్రజలకు ‘వర’ం తిరుపతి పార్లమెంట్ కూటమి అభ్యర్థి వరప్రసాద్ ఎదుటి వాళ్లను తిట్టడం, సొంత వాళ్లను ఆకాశానికి ఎత్తడం ఆయన నైజం. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని 2014లో తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత గూడూరు ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆయన పనితీరు బాగాలేక పోవడంతో టికెట్ ఇవ్వలేదు. పదవుల రుచి మరిగిన ఆయన గారికి ఇప్పుడు దళిత జాతి ఆత్మగౌరవం గుర్తుకు రావడం విడ్డూరంగా ఉంది. దళితుల్ని జగన్ అణచివేస్తున్నారనే ఆయన గారి విమర్శలు విన్న జనానికి దెయ్యాలువేదాలు వల్లించినట్లుందని చెప్పుకుంటున్నారు. అధికారం కోసం ఆయన మొదట ప్రజారాజ్యం, ఆ తరువాత వైఎస్సార్సీపీ, ఇప్పుడు బీజేపీలో చేరారు. టీడీపీ, జనసేన వద్దంటే బీజేపీ కండువా కప్పుకుని కూటమి అభ్యర్థి అయ్యారు. ఇతను పదవి కోసం తప్ప ప్రజలతో సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుంటారు. గతంలో ఆయన తిరుపతి ఎంపీగా కొనసాగినప్పటికీ,ప్రజానీకంతో సంబంధం లేకుండా, అలంకారప్రాయంగా ఉన్నారు. ఎవరైనా సమస్యతో వరప్రసాద్ దగ్గరికెళితే ఛీత్కరించుకున్న ఘటనలు బోలెడు. వరప్రసాద్ ఎంపీ, ఎమ్మెల్యే అయ్యారంటే కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డి చలువే.రౌడీయిజం..ఆరణి నైజం తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. మొన్నటి వరకు చిత్తూరు జిల్లా కేంద్రం. అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా.. ఆయన అస్సలు పట్టించుకోలేదు. తమ సమస్యలపై వెళితే ఎంత ఇస్తావ్..? అని అడిగిన సందర్భాలేన్నో ఉన్నాయని బాధితులు చెబుతుంటారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని భూములు ఆక్రమించుకోవడం, అభివృద్ధి పనుల్లో పర్సెంటేజ్లు, అధికారుల నుంచి మామూళ్లు, నమ్ముకున్న వాళ్లకు వెన్నుపోటు పొడవడం, రౌడీయిజం ఆరణి నైజం. ఆయన మొదట టీడీపీలో ఉంటూ.. టికెట్ ఇవ్వకపోతే ప్రజారాజ్యంలో చేరి చిత్తూరు అభ్యరి్థగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మరళా టీడీపీలో చేరారు. అప్పుడూ టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని ఎమ్మెల్యే అయిన ఆరణి స్వార్థ రాజకీయం కోసం జనసేనలో చేరి ప్రశాంతతకు మారుపేరైన తిరుపతిలో అలజడులు సృష్టిస్తున్నారు. స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. -
అవినీతిలో ‘ఆది’పత్యం
ఆయనో మాజీ మంత్రి. సొంత పేరు కంటే.. పేకాట పాపారావంటే స్థానిక ప్రజలు సులభంగా చెప్పేస్తారు. సోదరుడిని, ఆయన తయారు చేసుకున్న వర్గాన్ని అణగదొక్కి మరీ రాజకీయాల్లోకి వచ్చారు. దివంగత మహానేత వైఎస్సార్ భిక్షతో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన మరణం తర్వాత విచ్చలవిడి దోపిడీకి బరితెగించారు. గండికోట ప్రాజెక్టు, గాలేరు–నగరి సొరంగం పనుల కాంట్రాక్టర్ల నుంచి రూ.కోట్లలో దోచుకున్నారు.కాలువ తవ్వకాల్లో వచి్చన బండరాళ్లను కూడా వదల్లేదు. కంకరగా మార్చి అక్రమార్జన చేశారు. పక్క రాష్ట్రానికి ఇసుక తరలించేందుకు పెన్నానదికి గర్భశోకం కలిగించారు. నీరు–చెట్టు పథకంలో ఆయన దోపిడీకి అడ్డు లేదంటే అతిశయోక్తి కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, నమ్మినవారిని నట్టేట ముంచడం,పారీ్టలు మారడం అంటే ఆయనకు మంచినీళ్లు తాగినంత సులభం.సాక్షి టాస్క్ ఫోర్స్: ‘‘జమ్మలమడుగులో వర్గ పోరాటం కొనసాగించాం. మా సర్వస్వం కోల్పోయాం. ఆస్తులు కూడా తాకట్టులో ఉన్నాయి. ఒక్క అవకాశం ఇవ్వండి..’’ అంటూ రాజకీయాల్లోకి వచ్చారు. గెలిచారు. ఆ తర్వాత ఆయన సాగించిన దోపిడీతో రాష్ట్రంలోనే అత్యధిక సంపాదనాపరుల్లో ఒకరిగా మారారు. ప్రకృతి వనరుల దోపిడీలో ఆయన జోరు చూసి నియోజకవర్గ ప్రజలే నోరెళ్లబెట్టారు. ప్రభుత్వ, కొండ పోరంబోకు భూములను వందల ఎకరాలు స్వాహా చేసి, తన సాగులోకి చేర్చుకున్నారు. సోలార్ ప్రాజెక్టు పనుల్ని శాసించారు. చివరికి గండికోట నిర్వాసితుల చెక్కుల్నీ స్వాహా చేశారు. చెప్పుకుంటూ పోతే.. ఆయన అక్రమాలకు లెక్కే లేదు. ఇప్పుడు కేంద్ర పారీ్టలో చేరి, మళ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రతి అవకాశం.. ఆదాయ మార్గందేవగుడి, గొరిగనూరు, పెద్దదండ్లూరు, సున్నపురాళ్లపల్లె, చలివెందుల, సుగమంచుపల్లె, ధర్మాపురం గ్రామాల్లో ఈ నేత కుటుంబ ఆధిపత్యం యథేచ్ఛగా సాగుతోంది. అనూహ్య పరిస్థితుల్లో అమాత్యుని హోదా దక్కించుకున్నారు. ఇంకేముంది ఆయా గ్రామాల పరిధిలో పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బెంగళూరు తదితర ప్రాంతాలకు భారీ వాహనాలతో ఇసుకను తరలించారు. కేవలం ఇసుక తరలింపుతోనే రూ.వందల కోట్లు ఆర్జించారు.పేకాట పాపారావు ఈయనకు స్థానికంగా మరో పేరు కూడా ఉంది. పేకాట పాపారావుగా బాగా ప్రసిద్ధి. 2019 ఎన్నికల తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా పేకాట కోసం బెంగళూరు క్లబ్బును తన నివాసంగా మార్చుకున్నారు. గత నాలుగున్నరేళ్లూ నమ్ముకున్న కార్యకర్తలకు దూరంగా పత్తాలేకుండా పోయారు. ఆ మధ్య ఓ చానల్ ఇంటర్వ్యూలో కూడా తన జూద ప్రావీణ్యతను మహ సరదాగా చెప్పుకొచ్చారు.ఆ నేతపై ఉన్న కేసుల్లో కొన్ని ఈ నేతపై పోలీసు కేసులు కూడా ఉన్నాయి. ∗ 2020లో క్రైమ్ నెం.130 పేరిట 143, 144, 147, 148, 323, 324, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ∗ మైదుకూరు పోలీసు స్టేషన్లో క్రైమ్ నెం.239/2020 కేసు ఉంది. ∗ తుళ్లూరులో క్రైమ్ నెం.65/2023 ఐపీసీ 294, 504, 505(2), 506 సెక్షన్ల కింద కేసులు నమోదయినట్లు సదరు నేత తన ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు.ప్రభుత్వ భూములు స్వాహా.. ఈ మాజీ అమాత్యుని కుటుంబ సభ్యులు పెన్నానది ఇసుకతో సరిపెట్టుకోలేదు. ఇసుక తరలిపోగా ఏర్పడిన గట్టి ప్రాంతాన్ని వ్యవసాయ భూములుగా మార్చి, సాగులోకి తెచ్చారు. సమీప బంధువుల పేరిట సున్నపురాళ్లపల్లె సమీపంలో 300 ఎకరాలు సాగుచేసి అనుభవిస్తుండగా, అవి స్టీల్ ప్లాంట్ పరిధిలోకి వెళ్లాయి. సర్వే నెం.411లో కొండపోరంబోకు భూమిని ఆక్రమించి బినామీల పేర్లతో సాగు చేసుకునేవారు. సర్వే నెం.64లో గొరిగనూరు గ్రామానికి చెందిన ఈతని బంధువు సబ్ డివిజన్ చేయించి మరీ భూముల్ని ఆక్రమించారు. దేవగుడి ఆధిపత్య గ్రామాల్లో ఈ కుటుంబం వందలాది ఎకరాల కొండ ప్రాంతాన్ని ఆక్రమించి సొమ్ము చేసుకుంది.‘డైమన్షనల్’దందా టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఈయనకు అడ్డూఅదుపూ లేదు. మైలవరం మండలంలోని కొండల్లో విలువైన, అరుదైన ఖనిజాలు లభిస్తాయి. అందులో డైమన్షనల్ స్టోన్ ఒకటి. ఆ రాయిని శిల్పాలు, దేవాలయాల నిర్మాణానికి ఉపయోగిస్తారు. ఒక్కొ టన్ను ధర రూ.వేలల్లోనే. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండా, రాయల్టీ చెల్లించకుండా అక్రమంగా తరలించారు. రూ.కోట్లలో ఆర్జించారు.గ్రావెల్ అక్రమ రవాణా స్థానికంగా అడ్డుకునే వారు లేకపోవడంతో.. నియోజకవర్గ పరిధిలోని శిరిగేపల్లి, సున్నపురాళ్లపల్లె కొండల్లో రోడ్లకు ఉపయోగపడే గ్రావెల్ను ఈ మాజీ అమాత్యుని సమీప బంధువే అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. పొక్లెయినర్ల సాయంతో కొండలు, గుట్టల్ని పెకలించేశారు. క్రషర్ ద్వారా కంకరగా మార్చి సొమ్ము చేసుకున్నారు.పాలూరు ఎత్తిపోతల పథకం చేపట్టిన కోయా కంపెనీ, సుజిలాన్ పవర్ విండ్ ప్రాజెక్టుతోపాటు సోలార్ కంపెనీ యాజమాన్యం నుంచి ఎన్నికల ఖర్చుల పేరిట దందాల ఆరోపణలూ ఉన్నాయి. ఎన్టీపీసీ సోలార్ ప్రాజెక్టు ఎర్త్ పనులు ఈ కుటుంబం కనుసన్నుల్లోనే జరిగాయి. నీరు–చెట్టు పథకం ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్లు పనులు జరిగితే, అందులో సగం సొమ్ము ఈయన సన్నిహితుల జేబులోకే వెళ్లినట్లు సమాచారం.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
బాంబీ బకెట్ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే
- కృష్ణమ్మ తీరం విజయహారం
- గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
- పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- నిట్టనిలువునా చీలిపోతున్న 127 ఏళ్ల కంపెనీ
- ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
- Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
- ‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
Advertisement