గద్వాల/నాగర్కర్నూల్, న్యూస్లైన్: అప్పులబాధ నుంచి గట్టెక్కుదామని భావించిన అన్నదాత ఆశలు అడియాసలయ్యాయి. గతేడాది అనావృష్టి.. ఈ ఏడాది అతివృష్టి పత్తి రైతును చిత్తుచేశాయి. ఈ ఖరీఫ్లో ఎన్నో ఆశలతో పత్తిపంట సాగుచేస్తే ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. కీలకమైన క్రాసింగ్దశలో వర్షం కురుస్తుండటంతో విత్తన పత్తిపూత రాలిపోతుం ది. అలాగే జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో పత్తిపైరు తెగుళ్లబారినపడి ఎర్రగా మారిం ది. వరదనీటిలోనే మురిగిపోతుంది. ఇ ప్పటికే దోమకాటు తెగులు పత్తిపంట ఆ శించడంతో ఎన్ని మందులు పిచికారి చేసినా వర్షాల కారణంగా ఫలితం లే కుండాపోయింది.
పత్తి విత్తనరైతులు ఏ టా ఏప్రిల్లో పంటను విత్తుకుని మే చి వరి నుంచి జులై చివరి వరకు క్రాసింగ్ చేసుకునేవారు. అయితే ఈ సారి పత్తి విత్తనాలను రైతులకు ఇచ్చే విషయంలో కంపెనీలు జాప్యం చేయడంతో జూన్ ఆఖరి నుంచి రైతులు తమ పొలాల్లో ప త్తిని సాగు చేసుకున్నారు. 100రోజుల తరువాత మగ, ఆడ పువ్వులకు క్రాసిం గ్ చేసుకునేవారు. ప్రస్తుత కీలక సమయంలో వర్షం కురుస్తుండటంతో రైతులకు ఇబ్బందికరంగా మారింది. పంట కాపు సమయంలో వర్షాలు అధికమవడంతో ఆశించిన కాయలు రాక, తెగుళ్లను నివారించుకోలేక రైతులు అయోమయంలో పడ్డారు.
విత్తనపత్తి రైతుకు తీవ్ర నష్టం
వాతావరణ పరిస్థితులు అనుకూలించే నడిగడ్డ ప్రాంతంలో రైతులు ఈ ఖరీఫ్ లో సుమారు 30వేల ఎకరాల్లో విత్తనపత్తిని సాగుచేశారు. ఇందుకోసం ప్రతి ఎ కరా సాగుకోసం రూ.30 నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ప్ర తిరైతు ఎక్కువ విస్తీర్ణంలోనే సాగుచేశా డు. పంటకాపు ప్రారంభమయ్యే దశలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతుకు ఇ బ్బందికరంగా మారింది. వర్షాల కారణంగా పొలంలో పంటకు ఉపయోగప డే ఎలాంటి ఎరువులను వేసుకునే పరిస్థి తి లేకుండాపోయింది. తెగుళ్ల ఉధృతి కూ డా మొదలైంది. పంటను కాపాడుకోలే రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు.
రైతు కష్టం వర్షార్పణం
ఈ ఏడాది నాగర్కర్నూల్ నియోజకవర్గంలో 70వేల ఎకరాల్లో పత్తి సాగయింది. ఇందుకోసం రైతులు సుమారు రూ.105 కోట్లు ఖర్చుచేశారు. ఒక్కోరైతుసాగుకోసం రూ.20 నుంచి రూ.28వేల వరకు ఖర్చుచేశారు. తొలుత సకాలంలో వర్షాలు కురవడంతో పైర్లు కూడా ఆశాజనకంగా ఎదిగాయి. అయితే నెలరోజులుగా భారీ ముసురు వర్షాలు పత్తి పంటను తీవ్రంగా నష్టపరిచాయి. ఎదిగిన పైరుకు తొలుత గూడ(పత్తికాయ) చక్కగా కాసింది. దీంతో ఈసారి దిగుబడి భారీగా వస్తుందని రైతులు భావించారు.
వర్షాలు కూడా అనుకూలించడంతో పెట్టుబడులకు ఏమాత్రం వెనకంజ వేయలేదు. వర్షాలు ఎడతెరిపి ఇచ్చి కాస్త ఎండ రాగానే ఎరువులు, పురుగు మందులు చల్లుతూ వచ్చారు. కాగా కొంతకాలంగా వరుసగా వస్తున్న వర్షాలు పత్తిపంటపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నల్లరేగడి నేలలో పొలాల్లో నీరు నిలిచి ఎదుగుదల ఆగిపోయింది. ఆకులు ఎర్రగా మారాయి. గూడ కొంత రాలిపోగా మరికొంత పక్వం కాకముందే కాయ పగిలి వర్షాలకు తడిసి పత్తి నల్లగా మారుతోంది. కొత్తగా కాయలు కాయకపోవడం, ఉన్న వాటి పరిస్థితి ఇలా కావడంతో దిగుబడి పూర్తిగా పడిపోయే ప్రమాదం ఏర్పడింది.
రూ.140కోట్లకు పైగా పంటనష్టం
సాధారణంగా ఎర్ర, ఇసుక నేలల్లో ఎకరాకు ఐదు నుంచి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఒండ్రుమట్టి నేలల్లో 8నుంచి12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఆ లెక్కన సరాసరి ఈ ఏడాది ఐదు లక్షల క్వింటాళ్లకు పైగా పత్తి దిగుబడి రావాల్సి ఉంది. దీనికి ధరను పరిశీలిస్తే రూ.250కోట్ల ఆదాయం రైతులకు రావాల్సి ఉంది. అయితే అతివృష్టి ఫలితంగా పరిస్థితి తారుమారైంది.
పత్తి రైతు చిత్తు
Published Sun, Sep 22 2013 4:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా
బీజేపీలో చేరిన రాధికా ఖేరా.. ఎవరీమె?
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
బీజేపీపై డింపుల్ యాదవ్ కీలక వ్యాఖ్యలు: పదేళ్లలో..
ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!
డీప్ఫేక్ టెక్నాలజీకోసం ఇంటెల్తో జతకట్టనున్న ప్రముఖ కంపెనీ
ఇచ్చాపురంలో సీఎం జగన్ రోడ్ షో, జనసంద్రంగా మారిన ప్రధాన రహదారి (ఫోటోలు)
Rashmi Gautam: విదేశాల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న రష్మి (ఫోటోలు)
ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య
కూల్ లుక్తో కేక పుట్టిస్తున్న బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ (ఫొటోలు)
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement