బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం
విశాఖపట్నం జిల్లా : వాయివ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. బంగ్లాదేశ్ తీరం వైపు పయనిస్తూ, రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ, తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. చత్తీస్గడ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. రాయలసీమలో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
కోస్తా జిల్లాల్లో రాగల 24 గంటల్లో అక్కడక్కడ ఉరుమలు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయి. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ, తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.
మరిన్ని వార్తలు