'30 ఏళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నా' | chandrababu naidu said he lived hyderabad since 30 years | Sakshi
Sakshi News home page

'30 ఏళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నా'

Oct 5 2014 4:32 PM | Updated on Sep 2 2017 2:23 PM

'30 ఏళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నా'

'30 ఏళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నా'

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు కలిసిమెలసి ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు కలిసిమెలసి ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. భౌగోళికంగా విడిపోయినా తెలుగువారంతా మానసికంగా ఒక్కటిగానే ఉండాలని కోరుకున్నారు. భాష, ప్రాంతం, దేశం మన అనుబంధాన్ని పెంచుతాయని అన్నారు.

30 ఏళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నానని, రేపటిరోజు కూడా ఉంటా అని చెప్పారు. ఒకరికొకరు సహరించుకుంటూ ముందుకెళ్లాలన్నారు. బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఆదివారం నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 

Advertisement
 
Advertisement
Advertisement