గ్యాస్ పేలుడు బాధితుల్ని ఆదుకోవాలి: చాడా | chada venkat reddy write letter to chandrababu naidu | Sakshi
Sakshi News home page

గ్యాస్ పేలుడు బాధితుల్ని ఆదుకోవాలి: చాడా

Jun 29 2014 10:10 PM | Updated on Apr 3 2019 4:38 PM

గ్యాస్ పేలుడు బాధితుల్ని ఆదుకోవాలి: చాడా - Sakshi

గ్యాస్ పేలుడు బాధితుల్ని ఆదుకోవాలి: చాడా

నగరం గ్రామంలో జరిగిన గ్యాస్ పేలుడు దుర్ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్రకమిటీ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన గ్యాస్ పేలుడు దుర్ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్రకమిటీ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే పేలుడు జరిగిందని, బాధితులకు ఎంత నష్టపరిహారం ఇచ్చినా సరిపోదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

గ్యాస్ పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement