తెలంగాణపై కేబినెట్ నోట్ను చించలేరా? | can not you tear off cabinet note on Telangana, Vasireddy Padma asks congress | Sakshi
Sakshi News home page

తెలంగాణపై కేబినెట్ నోట్ను చించలేరా?

Oct 3 2013 12:57 PM | Updated on May 25 2018 9:10 PM

తెలంగాణపై కేబినెట్ నోట్ను చించలేరా? - Sakshi

తెలంగాణపై కేబినెట్ నోట్ను చించలేరా?

జైలు శిక్ష పడిన చట్టసభ సభ్యుల సభ్యత్వాలను కాపాడేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్నే చించేశారని.... అలాంటిది తెలంగాణపై కేబినెట్ నోట్ను చించలేరా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు.

హైదరాబాద్ : జైలు శిక్ష పడిన చట్టసభ సభ్యుల సభ్యత్వాలను కాపాడేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్నే చించేశారని.... అలాంటిది తెలంగాణపై కేబినెట్ నోట్ను చించలేరా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె గురువారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కనీసం నోట్ను ఆపలేకపోయారన్నారు.

తెలంగాణపై కేబినెట్ సిద్ధం చేయటం అంటే సీమాంధ్ర ప్రజలను అవమాననించినట్లేనని వాసిరెడ్డి పద్మ అన్నారు. 65 రోజులుగా సీమాంధ్ర ఉద్యమం జరుగుతున్నా.... కేంద్రం పట్టించుకోవటం లేదని ఆమె మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజల ఆవేదన కనిపించటం లేదా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.  చివరి బంది వరకు పోరాడతామన్న ముఖ్యమంత్రి.... ఇప్పుడు తల పగిలేలా ఉన్నా పట్టించుకోవటం లేదన్నారు.  కేబినెట్ ఎదుట తెలంగాణ నోట్ పెడితే.....పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement