రాజకీయ లబ్ధికోసమే విభజన : సబ్బం హరి | Bifurcation only for Political Benefits, says Sabbam Hari | Sakshi
Sakshi News home page

రాజకీయ లబ్ధికోసమే విభజన : సబ్బం హరి

Dec 29 2013 12:36 PM | Updated on Sep 27 2018 5:59 PM

రాజకీయ లబ్ధికోసమే విభజన : సబ్బం హరి - Sakshi

రాజకీయ లబ్ధికోసమే విభజన : సబ్బం హరి

కేంద్రం రాజకీయ లబ్ధికోసమే రాష్ట్ర విభజన చేస్తొందంటూ ఎంపీ సబ్బంహరి వ్యాఖ్యానించారు. సమైక్య ముసుగులో అన్నీపార్టీలు రాజకీయం చేస్తున్నాయని సబ్బం విమర్శించారు.

హైదరాబాద్: కేంద్రం రాజకీయ లబ్ధికోసమే రాష్ట్ర విభజన చేస్తోందని అనకాపల్లి ఎంపీ సబ్బంహరి వ్యాఖ్యానించారు. సమైక్య ముసుగులో అన్నీపార్టీలు రాజకీయం చేస్తున్నాయని సబ్బం విమర్శించారు. ఆదివారమిక్కడ ఏపీ ఏపీ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ..  విభజనే వద్దనుకున్నప్పుడు ఏం కావాలో అడిగే పరిస్థితి రాదని అన్నారు. విభజన అంశంపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా చర్చలో పాల్గొనాలని సబ్బం హరి తెలిపారు.

కాగా, ఈ సమావేశానికి ఆయనతోపాటు ఎంపీ అమలాపురం కాంగ్రెస్ ఎంపీ జివి హర్షకుమార్, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్,  రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావులు హాజరైయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement