ఆంధ్రప్రదేశ్లో బి-కేటగిరీ మెడికల్ సీట్ల భర్తీకి శనివారం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కౌన్సెలింగ్ ప్రారంభమైంది.
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఆంధ్రప్రదేశ్లో బి-కేటగిరీ మెడికల్ సీట్ల భర్తీకి శనివారం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
మొదటి రోజు 2,300 అభ్యర్థులను ఆహ్వానించగా, సాయంత్రం 6.30 గంటల సమయానికి 350 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ అయినట్లు కౌన్సెలింగ్ కన్వీనర్ డాక్టర్ కొడాలి జయరమేష్ తెలిపారు. కౌన్సెలింగ్లో మొదటి సీటును నీట్లో 7,077 ర్యాంకు సాధించి, స్థానికంగా 16 ర్యాంకు పొందిన శ్రవణం జయసూర్య ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో సీటు తీసుకున్నాడు.