ఆర్టీసీ డిపోపై అధికారుల చిన్నచూపు
మడకశిర: స్థానిక ఆర్టీసీ డిపో బస్సులంటే ప్రయాణికులు భయపడుతున్నారు. ఈ బస్సుల్లో ఎక్కితే క్షేమంగా గమ్యస్థానానికి చేరుకుంటామనే నమ్మకం ప్రయాణికుల్లో లేదు. ముఖ్యంగా మడకశిర ఆర్టీసీ డిపోకు ఇంతవరకు పూర్తి స్థాయి హోదా లభించలేదు. హిందూపురం డిపోకు అనుబంధంగా కొనసాగుతోంది. పురం డిపో మేనేజరే ఈ డిపోకు కూడా ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ డిపోపై పర్యవేక్షణ కొరవడింది. బస్సుల నిర్వహణ అధ్వానంగా మారింది.
ముఖ్యంగా ఈ డిపో పరిధిలో స్క్రాప్బస్సులను కూడా నడుపుతున్నారు. గతంలో రొళ్ల వద్ద ఓ ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు రెండు కూడా ఊడిపోయాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇటీవల గంగులవాయిపాళ్యం వద్ద ఆర్టీసీ బస్సుఢీకొని ఓ ఇంటర్ విద్యార్థి వృతి చెందాడు. బస్సు కండీషన్లో ఈ ప్రమాదం జరిగేది కాదని తెలుస్తోంది.
డిపోలోని 75 శాతం బస్సులకు డోర్లు లేవు. దీంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పెనుకొండ ఘాట్లో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు కండీషన్ కూడా అంతంత మాత్రమే. ఈ బస్సు 8.75 లక్షల కిలోమీటర్లు తిరిగింది. స్క్రాప్కు దాదాపుగా దగ్గరగా ఉంది. ఇలాంటి బస్సును ఘాట్ సెక్షన్లో నడపడానికి ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని ప్రయాణికులు తప్పుపడుతున్నారు. బాలేపల్లి, దొడ్డేరి తదితర సర్వీసులను విద్యార్థుల కోసమే నడుపుతున్నారు. ప్రతి రోజూ ఈ బస్సుల్లో వంద మంది వరకు విద్యార్థులు ప్రయాణిస్తుంటారు.
ఈ బస్సులు ఏమాత్రం కండీషన్లో లేవు. గతంలో ఈ డిపోకు కొన్ని కొత్తబస్సులను కేటాయించారు. త ర్వాత ఈ బస్సులను ఇతర డిపోలకు పంపారు. వీటి స్థానంలో డొక్కుబస్సులను ఈ డిపోకు పంపారు. డొక్కుబస్సులు లేకుండా చూడాలని ఆర్టీసీ యూనియన్లు గతంలో ఆందోళన కూడా చేశారు. అయినా కూడా ఆర్టీసీ అధికారులు చలనం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ డిపోకు కొత్త బస్సులను మంజూరు చేయించడంలో విఫలమవుతున్నారు.
ఇదిలా ఉండగా కొంత మంది డ్రైవర్లు బస్సులను నడపడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోన్లలో మాట్లాడటం, బానెట్పై ఇతరును కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో కొంత మంది డ్రైవర్లు మద్యం సేవించి బస్సులు నడిపిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలను అధికారులు సీరియస్గా తీసుకోవడం లేదు.
ఏదిఏమైనా మడకశిర డిపోలోని డొక్కుబస్సులు ఇంకా ఎన్ని ప్రాణాలు బలితీసుకుంటాయో చెప్పలేము. పెనుకొండ ఘాట్ ప్రమాద సంఘటన తోనైనా ఆర్టీసీ అధికారులు మేల్కొని కండీషన్ బస్సులు నడిపి ప్రయాణికుల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మడకశిర డిపోలో అన్నీ డొక్కు బస్సులే..
Published Thu, Jan 8 2015 3:16 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసిన కన్నప్ప టీం!
జూన్ 4 తర్వాత 'గూగుల్ పే' బంద్.. ఎక్కడంటే?
TS Cabinet Meet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
రతన్టాటా.. అణువణువూ ఆదర్శమే..!
తెలుగులో ఫస్ట్ మూవీనే సూపర్ హిట్.. కానీ ఆ తర్వాతే.. ఈమెని గుర్తుపట్టారా?
ఎన్నికలు vs ఏఐ
ఇన్సూరెన్స్ సేవల్లోకి ప్రముఖ సంస్థ
ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్..
హోండా 0 సిరీస్ ఎలక్ట్రిక్ కార్లు.. 500 కిమీ టార్గెట్!
తప్పక చదవండి
- ఎన్నికలు vs ఏఐ
- ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement