
'గవర్నర్ గంగిరెద్దులా తల ఊపుతున్నారు'
ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గవర్నర్ నరసింహన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గవర్నర్ నరసింహన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సెక్షన్ 8పై మార్గదర్శకాలు రాలేదని గవర్నర్ కుంటిసాకులు చెబుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. గవర్నర్ది రాజ్యాంగ పదవని, ఆయన ఈ విషయంపై స్పందించాలని చెప్పారు. నరసింహన్ కుంటిసాకులు చెబుతున్నారని, గంగిరెద్దులా తల ఊపుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తన విధిని నిర్వర్తించడం లేదని, పదవిలో కొనసాగడం రాజ్యాంగానికి నష్టమని అచ్చెన్నాయుడు అన్నారు.