ఏసీబీ వలలో జీలుగుమిల్లి తహశీల్దార్ | acb caught jeelugumalli mro | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో జీలుగుమిల్లి తహశీల్దార్

May 13 2015 2:01 PM | Updated on Aug 17 2018 12:56 PM

లంచం తీసుకుంటూ పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి తహశీల్దార్ బుధవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులకు దొరికారు.

జీలుగుమిల్లి : లంచం తీసుకుంటూ పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి తహశీల్దార్ బుధవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులకు దొరికారు. మండలానికి చెందిన ఒక రైతుకు పట్టాదారు పాస్‌పుస్తకం మంజూరు చేసేందుకు తహశీల్దార్ జి.సాంబశివరావు రూ.10వేలు డిమాండ్ చేశారు. దీంతో సదరు రైతు ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచనల మేరకు బుధవారం మధ్యాహ్నం తహశీల్దారుకు పైకం అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement