22 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం | 22 tonnes of ration rice seized and 9 arrested in guntur district | Sakshi
Sakshi News home page

22 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

Dec 13 2015 12:28 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మాచర్ల: గుంటూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాచర్ల మండలం బూర్జ- అడిగొప్పల రహదారిలో ఆదివారం ఉదయం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా రవాణా చేస్తున్న 22 టన్నుల రేషన్ బియ్యంతో పాటు 9మందిని అదుపులోకి తీసుకున్నారు. రేషన్ బియ్యాన్ని రెండు లారీల్లో తరలిస్తుండగా  అధికారులు పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని, నిందితులను బూర్జ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement