22 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం | 22 tonnes of ration rice seized and 9 arrested in guntur district | Sakshi
Sakshi News home page

22 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

Dec 13 2015 12:28 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మాచర్ల: గుంటూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాచర్ల మండలం బూర్జ- అడిగొప్పల రహదారిలో ఆదివారం ఉదయం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా రవాణా చేస్తున్న 22 టన్నుల రేషన్ బియ్యంతో పాటు 9మందిని అదుపులోకి తీసుకున్నారు. రేషన్ బియ్యాన్ని రెండు లారీల్లో తరలిస్తుండగా  అధికారులు పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని, నిందితులను బూర్జ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement