న్యూజిలాండ్తో రెండో టీ20లో భారత్ విజయం సాధించిన తర్వాత జట్టు తరుఫున పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్కు హాజరైన ఖలీల్.. పలు ప్రశ్నలకు జవాబు ఇచ్చే సమయంలో ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే కోహ్లి గురించి ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఖలీల్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. అది చాలా సింపుల్ ప్రశ్న అయినప్పటికీ ఖలీల్ మాత్రం ఏమి చెబితే ఏమి అవుతుందో అనే సందిగ్ధంలో తటపటాయించాడు. ఇంతకీ ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్న ఏమిటంటే.. ‘ మీరు(జట్టు సభ్యులు) విరాట్ కోహ్లిని మిస్సవుతున్నారా’ అని అడగ్గా ఖలీల్ ఒక్కసారిగా నవ్వేశాడు. అందుకు సమాధానం పూర్తిగా ఇవ్వకుండానే ‘నెక్స్ క్వశ్చన్ ప్లీజ్’ అంటూ అడగడం ఖలీల్ తడబాటుకు అద్దం పడుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
కోహ్లిని మిస్సవుతున్నారా.. నెక్ట్స్ క్వశ్చన్ ప్లీజ్!
Feb 9 2019 3:01 PM | Updated on Mar 20 2024 4:00 PM
Advertisement
Advertisement
Advertisement
