నారా లోకేశ్‌ తోడల్లుడు శ్రీభరత్‌ అబద్ధాలు

రాజధాని భూముల విషయంలో టీడీపీ నేత నారా లోకేశ్‌ తోడల్లుడు శ్రీభరత్‌ అబద్ధాలు బట్టబయలైయ్యాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామం సమీంలోని సర్వే నంబర్‌ 93లో 498 ఎకరాల భూమిపై శ్రీభరత్‌ అవాస్తవాలు చెప్పినట్టు సీఆర్‌డీఏ అధికారులు తేల్చారు. ఈ భూములను కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే తమకు కేటాయించినట్టు భరత్‌ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చంద్రబాబు హయాంలో 2015, జూలై 15న జయంతిపురం భూములను విఎఫ్‌సీఎల్‌ ఫెర్టిలైజర్‌ కంపెనీకి కేటాయించినట్టు సీఆర్‌డీఏ అధికారులు వెల్లడించారు. లోకేశ్‌ తోడల్లుడికి భూములు కేటాయించిన తర్వాత ఈ ప్రాంతాన్ని చంద్రబాబు సర్కారు 2015, సెప్టెంబర్‌ 22న సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకొచ్చింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top