జనసేనకు మరో షాక్.. మరో సీనియర్ నేత గుడ్బై
జనసేన పార్టీకి విశాఖలో బిగ్ షాక్ తగిలింది. ఇసుక అంశంపై పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం నగరంలో లాంగ్ మార్చ్ చేపట్టిన సమయంలోనే ఆ పార్టీ సీనియర్ నేత పసుపులేటి బాలరాజు గుడ్బై చెప్పారు. జనసేనకు రాజీనామా చేసిన ఆయన ఈ సందర్బంగా పార్టీ అధినాయకత్వం తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేనలో ప్రజాసమస్యలపై చర్చ జరగడం లేదని, ఆ పార్టీతో ప్రజాసమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు తక్కువ అని ఆయన తేల్చి చెప్పారు. ఇసుక కొరతను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా.. పవన్ కల్యాణ్ మార్చ్లు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు