స్పీకర్‌కు పాలాభిషేకం... వైరల్‌! | Milk poured on Telangana Assembly Speaker Madhusudhana Chary | Sakshi
Sakshi News home page

స్పీకర్‌కు పాలాభిషేకం... వైరల్‌!

Apr 1 2018 6:50 PM | Updated on Mar 20 2024 3:44 PM

ఇంతవరకు దేవతా విగ్రహాలకు, చరిత్రలో నిలిచిన వారి విగ్రహాలకు, సినిమా హీరో కటౌట్లకు పాలాభిషేకాలు చూశాం. కానీ ఒక వ్యక్తికి పాలాభిషేకం చేయడం మాత్రం చూసి ఉండరు. ఇలాంటి వింత సంఘటన మన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఇంతకి పాలాభిషేకం జరిగింది ఎవరికనుకుంటున్నారా.. మన అసెంబ్లీ స్పీకర్‌ ఎస్‌ మధుసూదనా చారికి. ఆదివారం ఆయన అభిమానులు పెద్దపల్లిలో ఆయనకు పాలాభిషేకం చేశారు. ఇప్పుడా వీడియో నెట్టింటా హల్‌చల్‌ చేస్తుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement