కాంగ్రెస్‌లో చేరిన కొండా దంపతులు | Konda Surekha Joins Congress | Konda Murali And Konda Surekha Meets Rahul Gandhi | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో చేరిన కొండా దంపతులు

Sep 26 2018 1:40 PM | Updated on Mar 22 2024 10:49 AM

టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతలు కొండా సురేఖ, మురళీ దంపతులు బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో వారు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్‌ఎస్‌లో తమకు టికెట్‌ కేటాయించలేదని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై తీవ్రంగా ధ్వజమెత్తిన కొండా దంపతులు.. కాంగ్రెస్‌ గూటికి చేరనున్నట్టు మంగళవారమే సంకేతాలు ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్‌ కుటుంబంపై తీవ్ర  విమర్శలు చేసిన తర్వాత సాయంత్రానికి వారిద్దరూ ఢిల్లీ చేరుకున్నారు. దీంతో వారు కారు దిగి హస్తం గూటికి చేరబోతున్నట్టు స్పష్టమైంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement