తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్గా కాంటేకర్ మధుమోహన్
యువనేతగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన మధు 30 ఏళ్ల వయసులో రెండోవార్డు నుంచి కౌన్సిలర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొదట బీజేపీ నుంచి టికెట్ ఆశించినా రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. నిత్యం జనంలో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్న మధు తన టీమ్ మద్దతుతో ప్రచారంలో దూసుకుపోయారు. తనకు వచ్చిన యాపిల్ గుర్తుతో వినూత్న ప్రచారం నిర్వహిస్తూ ఎన్నికల్లో 77 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తుక్కుగూడ ఫలితాల్లో కొంత సంక్లిష్టత ఏర్పడటంతో స్వతంత్ర అభ్యర్థి అయిన మధును చైర్మన్ పదవి వరించింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు