మరో వివాదంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి | JC Diwakar Reddy and Prabhodananda Swamy photos Viral In social Media | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి

Sep 19 2018 4:52 PM | Updated on Mar 22 2024 11:28 AM

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామం కేంద్రంగా ఉన్న ప్రభోదానందస్వామి ఎవరో తనకు తెలియదని జేసీ బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ప్రభోదానందస్వామి వర్గీయులతో జేసీ వర్గీయులు ఘర్షణకు దిగుతుండటంతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభోదానంద ఎవరో తెలియదంటూ జేసీ చెబుతుండగా.. 12 ఏళ్ల కిందట ఆయనే స్వయంగా ప్రభోదానంద స్వామి ఆశ్రమాన్ని ప్రారంభించిన ఫొటోలు తాజాగా వెలుగుచూశాయి. ఆశ్రమం ప్రారంభం సందర్భంగా ప్రభోదానంద గొప్పవారంటూ జేసీ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement