మంచు పటాలంగా చెప్పుకునే ఇండోటిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) బెటాలియన్ భారత 70వ గణతంత్ర దినోత్సవం సదర్భంగా త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేశారు. భారత్ మాతా కీ జై.. అంటూ నినాదాలు చేస్తూ.. జాతీయ జెండాను చేతబూని కవాతు చేశారు. వీరు 18 వేల మీటర్ల ఎత్తులో గల లడక్ హిమ ప్రాంతంలో, జీరో డిగ్రీల చలిలో విధులు నిర్వహిస్తున్నారు. మైనస్ 30 వరకు ఇక్కడ ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. ఇక ఎవరెస్టు 3 కిలోమీటర్ల ఎత్తు మాత్రమే ఉండగా.. ఐటీబీపీ దళం దాదాపు 18 కిలోమీటర్ల ఎత్తులో రక్షణ సేవలందిస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపడుతోంది.
మంచుకొండల్లో భారత పతాక రెపరెపలు
Jan 26 2019 1:40 PM | Updated on Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement