సాక్షి, హైదరాబాద్ : సోమవారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ నగరంలోని అనేక కాలనీలు, రహదారులు, కూడళ్లు నీట మునిగాయి. కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. హుస్సేనీఆలంలో చికెన్ తీసుకెళ్లే ఆటోపైన విద్యుత్ వైరు తెగపడటంతో ఆటో విద్యుత్ ప్రవాహం జరగడం, వాహనం ఐరన్ ఫ్రేమ్ పట్టుకున్న డ్రైవర్ అఫ్సర్ అక్కడికక్కడే మరణించాడు. సాయంత్రం నుంచి మొదలైన వాన రాత్రి 7 గంటల సమయంలో కొంత మేరకు తగ్గుముఖం పట్టినప్పటికీ దాని ప్రభావం ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక అపార్ట్ మెంట్ల సెల్లార్లు నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని అనేక దుకాణాల్లోకి నీరు చేరింది. షాపుల్లోని అనేక వస్తువులు నీటిలో తడిసిన కారణంగా చాలా మందికి భారీ నష్టమే జరిగింది.
నీట మునిగిన షాపులు
Published Mon, Oct 2 2017 9:09 PM
Advertisement
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement