వచ్చే నెలలోనే ‘పంచాయతీ’ ఎన్నికలు !

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను వచ్చే నెల (ఫిబ్రవరి)లోనే నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. సర్పంచ్‌లను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలా, పరోక్షంగానా అన్నదానిపై ఇంకా చర్చ జరుగుతోందని, ఆ ఎన్నికల విధి విధానాలను కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో పొందుపరుస్తామని తెలిపారు. ఈ మేరకు వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నాలుగు వేల గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తామని, మున్సిపల్‌ చట్టానికి సవరణలు చేయాలని ఆలోచిస్తున్నామని వెల్లడించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top