తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఓ రైతు చంద్రబాబుపై నిండు సభలో విమర్శలు గుప్పించాడు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈసందర్భంగా అక్కడికి వచ్చిన రైతులు తమ బాధలను చంద్రబాబుతో చెప్పుకొనే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సభలో తనపై జరిగిన దాడిని ఓరైతు చంద్రబాబుకు చెప్పే ప్రయత్నం చేశాడు. సుబ్బయ్య అనే రైతు తనపై దాడిచేశాడని, ఈవిషయంపై పోలీసులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రామాంజనేయులు అనే రైతు చంద్రబాబుకు వివరించాడు.