విశ్వాపరీక్షలో గెలిచిన సీఎం పళనిస్వామి | palani swamy wins floor test of tamilnadu assembly | Sakshi
Sakshi News home page

Feb 18 2017 3:32 PM | Updated on Mar 21 2024 8:11 PM

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి బలపరీక్షలో నెగ్గారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు వ్యతిరేకించినా, తన శిబిరంలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చినా, ప్రతిపక్ష పార్టీలన్ని వ్యతిరేకంగా ఓటు వేసినా పళనిస్వామి సభలో మెజార్టీ నిరూపించుకున్నారు. శనివారం ప్రత్యేకంగా సమావేశమైన తమిళనాడు అసెంబ్లీకి మొత్తం 230 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దాంతో ప్రభుత్వం నిలబడాలంటే 117 ఓట్లు కావల్సి వచ్చాయి. వారిలో పళనిస్వామికి మద్దతుగా 122 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. దాంతో పళనిస్వామి అసెంబ్లీలో కూడా తన బలాన్ని నిరూపించుకున్నట్లు అయ్యింది

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement