ముంబై మేయర్ పదవిపై సందిగ్ధతకు తెరపడింది. బీజేపీ మద్దతుతో శివసేన కార్పొరేటర్ విశ్వనాథ్ మహదేశ్వర్ బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) మేయర్గా బుధవారం ఎన్నికయ్యారు. దీంతో ఎన్నికల సందర్భంగా విడిగా పోటీచేసిన ఇరుపార్టీలు మళ్లీ ఏకమయ్యాయన్న సంకేతాలిచ్చాయి.