అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బసచేసిన కువతూర్ సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. రిసార్ట్ను వెంటనే ఖాళీ చేయాలని ఎమ్మెల్యేలకు పోలీసులు సూచించారు. శశికళ, పళనిస్వామి తనను కిడ్నాప్ చేశారని ఎమ్మెల్యే శరవణన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గోల్డెన్ బే రిసార్ట్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కాంచీపురం ఎస్పీ రిసార్ట్ వద్దకు చేరుకుని విచారిస్తున్నారు. ఎమ్మెల్యేలు వెంటనే రిసార్ట్ను ఖాళీ చేసి వెళ్లాలని సూచించారు. పోలీసులు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
Feb 15 2017 3:59 PM | Updated on Mar 22 2024 10:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement