ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో దోపిడీకి పాల్పడిన దొంగల కోసం వేట మొదలైంది. రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పరపల్లిలో పోలీసులు పెద్ద మొత్తంలో తనిఖీలు మొదలుపెట్టారు. దొంగలు వాడిన టవేరా వాహనాన్ని పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవరపల్లి ముత్తూట్ ఫైనాన్స్ లో దుండగులు దోపిడీకి విఫలయత్నం చేశారు. కత్తి, తుపాకీతో మంగళవారం ఉదయం ముత్తూట్లోని వచ్చిన దుండగులు సిబ్బందిని బెదిరించారు. దీంతో అప్రమత్తమైన ముత్తూట్ అసిస్టెంట్ మేనేజర్ లతీఫ్ అలారం నొక్కడంతో స్థానికులు రావడంతో దుండగులు పరారయ్యారు.
Jul 4 2017 8:38 PM | Updated on Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement