రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రాంతానికి అన్యాయం జరుగుతుందని తాను ఆనాడే చెప్పానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆయన మాట్లాడారు. బీజేపీ- టీడీపీలు ఎన్నికల కంటే ముందే పొత్తు పెట్టుకున్నాయని ఆయన చెప్పారు. దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ పొత్తు కుదిరిందని అన్నారు. రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చారని, విశాఖలో రైల్వే జోన్, రాజధాని నిర్మాణానికి నిధులు, రెవెన్యూ లోటు భర్తీ చేయడంపై స్పష్టమైన హామీలు ఇచ్చారని కూడా చంద్రబాబు చెప్పారు. విభజన హామీలు నెరవేర్చే దిశగా కేంద్రంపై తప్పకుండా ఒత్తిడి తెస్తామని ఆయన అన్నారు. నీతి, నిజాయితీలతో ఉండే పార్టీ తమదని, రాజీ పడాల్సిన అవసరం లేదని తెలిపారు.
'విభజనతో ఆంధ్రకు అన్యాయమని చెప్పా'
Published Tue, Mar 10 2015 2:50 PM
Advertisement
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement