● యథేచ్ఛగా దోచుకెళ్లారు..
నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి వేలంలో ఎంబసీ గ్రూపు కొనుగోలు చేసి, టిపిన్ బైరెటీస్ కంపెనీ ప్రాంగణంలో నిల్వ ఉంచిన ఖనిజాన్ని యథేచ్ఛగా దోచు కెళ్లారు. దాదాపు 3,500 టన్నులు వేలంలో కొనుగోలు చేసి నిల్వ ఉంచగా రాత్రికి రాత్రే తరలించకెళ్లారు. 50 టన్నుల సామర్థ్యంతో తరలించే 20 లారీల ద్వారా సుమారు రూ.10 కోట్ల విలువైన నిల్వ ఉన్న బైరెటీస్ ఖనిజాన్ని దోచుకెళ్లారు. ఇదే విషయమై టిఫిన్ కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేసినా.. ఏడాదిగా ఎలాంటి చర్యలు లేవు. కంపెనీ స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలు బిగించుకుంటున్నా తెలుగు తమ్ముళ్లు ఓర్వలేకపోయారు. ఇవన్నీ మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైనా చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలలమయ్యారు.


