వివాహిత ఆత్మహత్య
పీలేరు రూరల్ : పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పీలేరు పట్టణం మోడల్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. మోడల్ కాలనీకి చెందిన త్రివేణి (25)కి ఏడేళ్ల క్రితం కేవీపల్లె మండలం గోరంట్లపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యంతో వివాహమైంది. గత కొంత కాలంగా తన ఇద్దరి పిల్లలతో త్రివేణి స్థానిక మోడల్ కాలనీలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం త్రివేణి పురుగుల మందు తాగి ఇంటిలో పడుకుంది. ఆమె నోట్లో నుంచి నురుగు రావడం గమనించి కుటుంబ సభ్యులు చికిత్సనిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


