గృహ ప్రవేశానికి వస్తూ తిరిగిరాని లోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

గృహ ప్రవేశానికి వస్తూ తిరిగిరాని లోకాలకు..

Nov 25 2024 8:09 AM | Updated on Nov 25 2024 1:36 PM

-

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు, కుమార్తె మృతి 

మైదుకూరు/కాశినాయన: బంధువుల నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆదివారం మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లెకు సమీపంలో ఈ సంఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కాశినాయన మండలం చిన్నాయపల్లెకు చెందిన గుర్రాల శ్రీనివాసులరెడ్డి వ్యవసాయం చేస్తుంటారు. ఈయనకు భార్య అరుణ, కుమార్తె పవిత్ర, కుమారుడు జగదీష్‌రెడ్డి ఉన్నారు.

 జగదీష్‌రెడ్డి ఖాజీపేటలో అవ్వగారి ఇంటి వద్ద ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం శ్రీనివాసులురెడ్డి భార్య కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంలో మైదుకూరు మున్సిపాలిటీలోని శెట్టివారిపల్లెలో సోమవారం జరిగే తమ బంధువుల గృహ ప్రవేశానికి బయలుదేరారు. ముదిరెడ్డిపల్లెకు సమీపంలో ఎద్దడుగు కనుమ వద్ద వెనుక వైపు నుంచి లారీ బైక్‌ను ఢీకొంది. \ఈ సంఘటనలో బైక్‌పై ఉన్న శ్రీనివాసులరెడ్డి, భార్య, కుమార్తె కిందపడిపోయారు. వారిపై నుంచి లారీ వేగంగా దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. 

తల్లిదండ్రులు, చెల్లెలు మృతి చెందడంతో జగదీష్‌రెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. చుట్టుపక్కల ఉన్న వారు గట్టిగా కేకలు వేస్తున్నా లారీ ఆపకుండా వెళ్లినట్టు తెలుస్తోంది. శుభకార్యానికి వెళుతూ ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందడంతో చిన్నాయపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని మైదుకూరు అర్బన్‌ సీఐ సయ్యద్‌ హాసం పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement