‘దోస్త్‌’ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి తేదీ | - | Sakshi
Sakshi News home page

‘దోస్త్‌’ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి తేదీ

Jun 19 2025 3:49 AM | Updated on Jun 19 2025 3:49 AM

‘దోస్

‘దోస్త్‌’ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి తేదీ

రామన్నపేట: డిగ్రీ కళాశాలల్లో ఫస్టియర్‌లో చేరేందుకు గాను డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌, తెలంగాణ(దోస్త్‌)లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు గురువారం చివరి తేదీ అని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాహత్‌ ఖానం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్‌ పాసైన విద్యార్థులు, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఎంపీసీ, బీజెడ్‌సీ, డైరీ సైన్స్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

స్వర్ణగిరీశుడికి అష్టదళ

పాదపద్మార్చన సేవ

భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో వేంకటేశ్వరస్వామికి బుధవారం 108 బంగారు అష్టదళ పద్మపుష్పాలతో అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన సేవ, మధ్యాహ్నం సుమారు 3వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ, కర్పూర మంగళహరతుల సమర్పణ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

శతాధిక వృద్ధురాలు మృతి

చిలుకూరు: చిలుకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ తమ్మనబోయిన శంకర్‌ మాతృమూర్తి తమ్మనబోయిన వెంకమ్మ(105) బుధవారం అనారోగ్యంతో మృతిచెందింది. ఆమెకు ఐదుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు సంతానం. వెంకమ్మ కుటుంబంలో కుమారులు, కుమార్తెలు, మనమలు, మనవరాళ్లు, ము ని మనవళ్లు, ముని మనవరాళ్లు కలిపి 60 మంది ఉన్నారు. వెంకమ్మ ఎలాంటి దీర్ఘకాలిక వ్యా దుల బారిన పడకుండా వందేళ్లకు పైగా జీవించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

ఎదురెదురుగా ఢీకొన్న

ఆటో, ఆర్టీసీ బస్సు

ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఆత్మకూర్‌(ఎస్‌)(సూర్యాపేట): ఆటో, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆత్మకూర్‌(ఎస్‌) మండల పరిధిలోని నెమ్మికల్లు గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్‌(ఎస్‌) మండల కేంద్రానికి చెందిన ఉప్పుల శ్రీశైలం ఆటోలో పాల డబ్బాలతో సూర్యాపేటకు వెళ్తుండగా.. నెమ్మికల్లు గ్రామంలో సూర్యాపేట నుంచి వరంగల్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ శ్రీశైలంకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అతడిని హైదరాబాద్‌కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

‘దోస్త్‌’ రిజిస్ట్రేషన్‌కు  నేడే చివరి తేదీ1
1/1

‘దోస్త్‌’ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి తేదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement