
బ్యాంకుల వద్ద బారులు
భువనగిరిటౌన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులు మంగళవారం రద్దీగా మారాయి. ప్రభుత్వం ఈ నెల 16 సాయంత్రం నుంచి రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమ చేస్తోంది. డబ్బులు డ్రా చేసుకునేందుకు రైతులు పెద్ద సంఖ్యలో బ్యాంకుల బాట పట్టారు. జిల్లాలో 2.84,250 మంది రైతులకు రూ.317.57 కోట్లు పంట పెట్టుబడి సాయం అందాల్సి ఉంది. వీరందరి ఖాతాల్లో తొమ్మిది రోజుల్లో నగదు జమచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎకరానికి రూ.6వేల చొప్పున మూడు ఎకరాల వరకు 1,33,736 మంది రైతుల ఖాతాల్లో రూ.72.62 కోట్లు జమయ్యాయి.
బ్యాంకర్ల తీరుతో రైతుల అవస్థలు
బ్యాంకర్ల తీరుతో రైతుభరోసా డబ్బులు డ్రా చేసుకోవడానికి ఇబ్బందులు పడినట్లు పలువురు రైతులు వాపోయారు. రైతుభరోసా సాయాన్ని ఇతర రుణాలకు లింక్పెట్టవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ, కొన్ని బ్యాంకులు అవేమీ పట్టించుకోకపోవడం రైతులు సాయంత్రం వరకు నిరీక్షించాల్సి వచ్చింది. విత్డ్రా ఓచర్లు ఇవ్వలేదని, అధికారులు సరైన సమాధానం చెప్పలేదని భువనగిరిలోని యూనియన్ బ్యాంకుకు వచ్చిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కర్షకుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమ
రెండు రోజుల్లో రూ.72.62
కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
విత్డ్రా చేసుకోవడానికి
బ్యాంకుల్లో అన్నదాతల క్యూ
ఇబ్బందులకు గురి చేస్తున్నారు
రైతుభరోసా డబ్బులు తీసుకోవడానికి భువనగిరిలోని యూనియన్ బ్యాంకుకు వెళ్లాను. పైసలు తీసుకునేందుకు ఓచర్ అడగగా అధి కారులు కాలయాపన చేశారు. సాయంత్రం వరకు వేచి చూడాల్సి వచ్చింది. నాలాంటి పరిస్థితినే చాలా మంది రైతులు ఎదుర్కొన్నారు.
– మచ్చ భాస్కర్, రైతు

బ్యాంకుల వద్ద బారులు

బ్యాంకుల వద్ద బారులు