
రైతునేస్తం.. సాగుకు ఊతం
భువనగిరిటౌన్, రామన్నపేట : వ్యసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా రైతులకు సలహాలు, సూచనలిచ్చేందుకు సోమవారం నిర్వహించే శ్రీరైతునేస్తంశ్రీ కార్యక్రమానికి రైతునేస్తం కేంద్రాలు రెడీ అయ్యాయి. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతునేస్తం కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలకు వచ్చిన రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు రైతునేస్తం కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. గతంలో 17 రైతువేదికల్లో మాత్రమే రైతునేస్తం కార్యక్రమం ప్రసారం అయ్యేది. తాజాగా మరో 34 రైతువేదికలకు పెంచారు. ప్రతి మండలంలో మూడు రైతువేదికల చొప్పున ఎంపిక చేసి రైతునేస్తం కార్యక్రమానికి సిద్ధం చేశారు.
పాల్గొననున్న ఎమ్మెల్యేలు
సీఎం పాల్గొనే రైతునేస్తం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు వీక్షించనున్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట రైతువేదిక, కుంభం అనిల్కుమార్రెడ్డి భువనగిరి శివారులోని రైతువేదిక, మందుల సామేల్ మోత్కూరు మండలం పాటిమట్ల రైతువేదికలో పాల్గొంటారు.
నేడు రైతులతో సీఎం ముఖాముఖి
51 రైతునేస్తం కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
పాల్గొననున్న 12,750 మంది రైతులు
ఒక్కో రైతువేదికలో 250 నుంచి 300 మంది రైతులు హాజరు
జిల్లా వ్యాప్తంగా 51 రైతువేదికల్లో 1,2750 మంది రైతులు హాజరుకానున్నారు. ఒక్కో వేదికలో 250 నుంచి 300మంది రైతులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. రైతునేస్తం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆయా గ్రామాల్లో రైతులకు ఇప్పటికే సమాచారం ఇవ్వడం, డప్పు చాటింపు వంటివి చేశారు.