స్వర్ణగిరిలో గిరిప్రదక్షిణ | - | Sakshi
Sakshi News home page

స్వర్ణగిరిలో గిరిప్రదక్షిణ

Jun 16 2025 5:04 AM | Updated on Jun 16 2025 5:04 AM

స్వర్

స్వర్ణగిరిలో గిరిప్రదక్షిణ

భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వెంకటశ్వరస్వామి దేవాలయం వద్ద అదివారం శ్రావణ నక్షత్రం సందర్భంగా భక్తులు గిరిప్రదక్షిణ చేశారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి సుభ్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్యకల్యాణం నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు 4వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం తిరువీధిఉత్సవ సేవ, రథోత్సవం నిర్వహించారు.

పద్మ పురస్కారాలకు

దరఖాస్తుల ఆహ్వానం

భువనగిరి : దేశంలో అత్యున్నతమైన పద్మ పురస్కారాలకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్‌, ఇంజనీరింగ్‌, పబ్లిక్‌ అఫైర్స్‌, సివిల్‌ సర్వీస్‌, వాణిజ్యం, పరిశ్రమలు మొదలైన రంగాల్లోవిశిష్ట సేవలు అందించి విజయాలు సాధించిన వారికి వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం రోజు అవార్డులు అందజేయనున్నారు. 2026 సంవత్సరానికి ఇచ్చే పద్మ పురస్కారాల కోసం నామినేషన్లు, సిఫారసులను రాష్ట్రపతి పురస్కార్‌ పోర్టల్‌ htt p://awards.gov.in ద్వారా జులై 31 లోగా పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు పద్మ అవార్డుల వెబ్‌సైట్‌ http://padmaawards. gov.inలో ఉన్నాయి.

కల్నల్‌ సంతోష్‌బాబు త్యాగం వెలకట్టలేనిది

సూర్యాపేటటౌన్‌ : దేశం కోసం కల్నల్‌ సంతోష్‌ బాబు చేసిన ప్రాణత్యాగం వెలకట్టలేనిదని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఆదివారం కల్నల్‌ సంతోష్‌బాబు వర్ధంతి సందర్భంగా సూర్యాపేటలోని సంతోష్‌బాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆర్మీ జవాన్‌గా విరోచితంగా పోరాడి దేశ రక్షణలో అసువులు బాసిన సంతోష్‌బాబును నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కల్నల్‌ సంతోష్‌బాబు గారి త్యాగాన్ని స్మరించుకోవడం ఆ కుటుంబానికి ఓదార్పన్నారు. కార్యక్రమంలో సంతోష్‌బాబు కుటుంబ సభ్యులు, ఆర్మీ అధి కారులు, ఆర్మీ జవాన్లు పాల్గొన్నారు.

స్వర్ణగిరిలో గిరిప్రదక్షిణ1
1/1

స్వర్ణగిరిలో గిరిప్రదక్షిణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement