
సైనిక్ గురుకుల కళాశాల విద్యార్థిని ఎయిర్ఫోర్స్ ఆఫీసర
బీబీనగర్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల 2021–2024 బ్యాచ్ విద్యార్థిని వి.కావ్య ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా ఎంపికయ్యారు.ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.జూన్ 28వ తేదీన దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ కార్యాలయానికి వెళ్లి విధుల్లో చేరనున్నారు. కళాశాల నుంచి ఇండియన్ ఎయిర్ఫోర్స్కు ఎంపికై న మొదటి విద్యార్థి కావ్య అని ప్రిన్సిపాల్ తెలిపారు. కావ్యను ప్రన్సిపాల్ శ్రీలత, కళాశాల కార్యదర్శి వర్షిణి, సహాయ కార్యదర్శి పీఎస్ఆర్ శర్మ, ఉప కార్యదర్శి రజిని, అధ్యాపకులు అభినందించారు.
వాట్సాప్ గ్రూపులో తప్పుడు పోస్టు చేసిన వారిపై కేసు
మోత్కూరు : మండలంలోని ముశిపట్ల గ్రామ వాట్సాప్ గ్రూపులో కాంగ్రెస్ నాయకులపై తప్పుడు పోస్టు చేసిన వారిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ డి.నాగరాజు తెలిపారు. వివరాలు.. ఈ నెల 6న మావూరి ముచ్చట్లు (ముశిపట్ల) గ్రూపులో కాంగ్రెస్ నాయకులపై, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నేర్లకంటి శ్రీనివాస్, బోనగిరి హరీష్ పోస్టు చేశారు. ఆ గ్రామానికి చెందిన నిమ్మల రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
గీత కార్మికుడికి గాయాలు
నకిరేకల్ : చందుపట్లకు చెందిన కొప్పు పెద్ద శ్రీను(44) గీత కార్మికుడు రోజువారీ మాదిరిగా తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో గాలి రావడంతో చెట్టు కూలిపోయి కిందపడి గాయపడ్డాడు. శ్రీనును కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.