
వివేరా హోటళ్ల అధినేతకు అవార్డు
భువనగిరి : ఉత్తమ రక్తదాతగా వివేరా హోటళ్ల అధినేత సద్ది వెంకట్రెడ్డికి అవార్డు లభించింది. రక్తదాన దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్లోని రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ జిష్టుదేవ్ వర్మ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. సద్ది వెంకట్రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు వివేరా హోటళ్లలో పనిచేసే సిబ్బంది ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తుంటారు. చాలా ఏళ్లుగా రక్తదానం చేస్తున్నందుకు గాను అవార్డు లభించినట్లు సద్ది వెంకట్రెడ్డి తెలిపారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడినవారం అవుతామన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ కిషోర్, ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, డైరెక్టర్ దిడ్డి బాలాజీ పాల్గొన్నారు. వెంకట్రెడ్డి పలువురు అభినందనలు తెలిపారు.