
లోక్ అదాలత్లో 9,411 కేసులు పరిష్కారం
భువనగిరిటౌన్ : జాతీయ లోక్ అదాలత్ ద్వారా 9,411 కేసులు పరిష్కారం అయ్యాయి. శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు సమక్షంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్అదాలత్ నిర్వహించారు. అన్ని కోర్టుల్లో ప్రత్యేకంగా 8 బెంచీలు, ఏర్పాటు చేశారు. కక్షిదారులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో హాజరై కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకునేందుకు చొరవ తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా క్రిమినల్ 2,516, సివిల్ 7, ప్రి లిటిగేషన్, టెలిఫోన్ రుణ బకాయి, ఎస్బీఐకి సంబంధించి 94, ట్రాఫిక్ చలాన కేసులు 6,794 పరిష్కారం అయ్యాయి.
రాజీమార్గమే రాజమార్గం :
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు
న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్అదాలత్కు అనూహ్య స్పందన లభించిందని జిల్లా ప్రధాన జడ్జి జయరాజు తెలిపారు. భువనగిరి కోర్టులో లోక్ అదాలత్ను ప్రారంభించి మాట్లాడారు. రాజీమార్గంలో కేసుల పరిష్కారంకోసం కక్షిదారులు పెద్ద ఎత్తున ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇందుకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు యంత్రాంగం చేసిన కృషిని కొనియాడారు. వైవాహిక వివాదాన్ని సామరస్యంతో పరిష్కరించుకొని ఒక్కటైన దంపతులకు అవార్డు అందజేసి అభినందించారు. రాజీమార్గమే రాజమార్గం అని.. చిన్న తగా దాలను లోక్ అదాలత్లో పరిష్కరించుకుని స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలని కక్షిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.మాధవిలత, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి.ముక్తిదా, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఉషశ్రీ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్యాంసుందర్, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి జిస్వాతి, ప్రభుత్వ న్యాయవాదులు, ఏపీపీలు సౌజన్య, చంద్రశేఖర్, న్యాయ సహాయ అడ్వకేట్లు ఎస్.జయపాల్, ఎన్.శంకర్, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
ఫ అన్ని కోర్టుల్లో 8 ప్రత్యేక బెంచీలు ఏర్పాటు
ఫ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కక్షిదారులు