కాలినడక భక్తులకు సౌకర్యాల కల్పన | - | Sakshi
Sakshi News home page

కాలినడక భక్తులకు సౌకర్యాల కల్పన

Jun 21 2025 3:51 AM | Updated on Jun 21 2025 3:51 AM

కాలిన

కాలినడక భక్తులకు సౌకర్యాల కల్పన

ద్వారకాతిరుమల : ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో కాలినడక భక్తులకు దేవస్థానం పెద్దపీట వేసింది. వృద్ధ, దివ్యాంగ భక్తుల సౌకర్యార్థం కొండపైన డార్మెటరీలో సుమారు 50 మంచాలను ఏర్పాటు చేసింది. చిన వెంకన్న దివ్య క్షేత్రానికి ప్రతి శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు కాలినడకన వస్తున్నారు. వారంతా శనివారం ఉదయం స్వామి, అమ్మవార్లను దర్శిస్తున్నారు. కాలినడక భక్తులకు సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించిన దేవస్థానం డార్మిటరీల ద్వారా వసతి సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలోనే వృద్ధ, దివ్యాంగ భక్తులకు డార్మెటరీలో మంచాలు ఏర్పాటు చేసింది. ఒక్కో భక్తుడి నుంచి రూ.20 నామమాత్రపు రుసుం వసూలు చేస్తోంది. వస్తువులను భద్రపరచుకునేందుకు లాకర్‌ సదుపాయం కల్పించారు.

కాలినడక భక్తులకు సౌకర్యాల కల్పన 1
1/1

కాలినడక భక్తులకు సౌకర్యాల కల్పన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement