
నాటుసారాపై దాడులు
ఏలూరు టౌన్: నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు చేపడతామని ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ నాగప్రభుకుమార్ హెచ్చరించారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సీహెచ్ అజయ్కుమార్ సింగ్ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ సీఐ భోగేశ్వరరావు, తన సిబ్బందితో నాటుసారా తయారీపై దాడులు చేశారు. శుక్రవారం లింగపాలెం మండలం మఠంగూడెం పరిధిలో నాటుసారా తరలిస్తున్నారనే సమాచారంతో దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 40 లీటర్ల నాటుసారా, రవాణాకు వినియోగించిన కారును సీజ్ చేశారు. తలార్లపల్లి గ్రామానికి చెందిన దేశవతు వేణు నాటుసారా తయారు చేస్తూ చుట్టుపక్కల గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మఠంగూడెం గ్రామానికి చెందిన జెర్రిపోతుల మారేశు, తొచలక రాయుడుపాలెం గ్రామానికి చెందిన పెనమలూరి చంటమ్మను ఎకై ్సజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వేణు సమాచారం మేరకు అతని ఇంటి సమీపంలో, పొలంలో తనిఖీలు చేయగా 200 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను స్వాధీనం చేసుకున్నామని ఎకై ్సజ్ సీఐ భోగేశ్వరరావు తెలిపారు. ప్రగడవరం అడ్డరోడ్డులో కిరాణాషాపు నిర్వహిస్తున్న అద్దంకి విశ్వేశ్వరరావు బెల్లం విక్రయించినట్లు అంగీకరించటంతో 5 కిలోల బెల్లం స్వాధీనం చేసుకుని, అతనిపైనా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు.